Just In
- 14 min ago
ప్రభాస్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
- 30 min ago
‘మాస్టర్’ డైరెక్టర్తో జూనియర్ ఎన్టీఆర్: కాంబినేషన్ సెట్ చేసిన ప్రముఖ నిర్మాత
- 51 min ago
ఇంతకంటే మంచి సినిమా ఉంటుందా.. ‘మాస్టర్’పై కుష్బూ కామెంట్స్
- 53 min ago
బాలీవుడ్లోకి ‘క్రాక్’: రవితేజ పాత్రలో రియల్ హీరో.. అదిరిపోయే ప్లాన్ రెడీ
Don't Miss!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- News
Corona Vaccine: ఐటీ హబ్ లో కోటి మంది ప్రజలు, 8 కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాలు, 1 లక్ష వ్యాక్సిన్ లు!
- Automobiles
పెరిగిన హోండా గ్రాజియా స్కూటర్ ధర, ఎంతంటే..?
- Sports
మూడో సెషన్ రద్దు.. ముగిసిన రెండోరోజు ఆట!! భారత్ స్కోర్ 62/2!
- Finance
మొబైల్ నెంబర్కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నిర్ణయం మార్చుకున్న పవన్ కల్యాణ్: దాన్ని పక్కన పెట్టి.. దీన్ని లైన్లో పెట్టాడు
చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ్యభిచార గృహంలో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్గా ఇందులో నటిస్తున్నాడాయన. వాస్తవానికి 2020లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా ప్రభావంతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఇటీవలే చిత్రీకరణను పున: ప్రారంభించి రెండు రోజుల క్రితం పూర్తి చేశారు.
'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ అవడంతో పవర్ స్టార్ దీని తర్వాత ఏ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆయన గతంలోనే క్రిష్ జాగర్లమూడితో సినిమా ప్రకటించారు. కానీ, ఇటీవల మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్లోకి వచ్చింది. దీంతో ఈ సినిమానే ముందుగా పూర్తవుతుందని పవన్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. అయితే, తన సినిమాల విషయంలో పవర్ స్టార్ నిర్ణయం మార్చుకున్నారట. ఇందులో భాగంగానే క్రిష్ మూవీని ముందుగా మొదలెడతారని తెలిసింది.

తాజా సమాచారం ప్రకారం.. క్రిష్ సినిమా కోసం జనవరి 4 నుంచి డేట్స్ కేటాయించాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దాదాపు నెల రోజుల పాటు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పిరియాడిక్ జోనర్లో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. మొదటి షెడ్యూల్లోనే పవన్తో పాటు ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.