Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నిర్ణయం మార్చుకున్న పవన్ కల్యాణ్: దాన్ని పక్కన పెట్టి.. దీన్ని లైన్లో పెట్టాడు
చాలా గ్యాప్ తర్వాత 'వకీల్ సాబ్' మూవీతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజుతో కలిసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ్యభిచార గృహంలో చిక్కుకున్న యువతులను రక్షించే లాయర్గా ఇందులో నటిస్తున్నాడాయన. వాస్తవానికి 2020లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా ప్రభావంతో షూటింగ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు చక్కబడడంతో ఇటీవలే చిత్రీకరణను పున: ప్రారంభించి రెండు రోజుల క్రితం పూర్తి చేశారు.
'వకీల్ సాబ్' షూటింగ్ కంప్లీట్ అవడంతో పవర్ స్టార్ దీని తర్వాత ఏ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆయన గతంలోనే క్రిష్ జాగర్లమూడితో సినిమా ప్రకటించారు. కానీ, ఇటీవల మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ లైన్లోకి వచ్చింది. దీంతో ఈ సినిమానే ముందుగా పూర్తవుతుందని పవన్ సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. అయితే, తన సినిమాల విషయంలో పవర్ స్టార్ నిర్ణయం మార్చుకున్నారట. ఇందులో భాగంగానే క్రిష్ మూవీని ముందుగా మొదలెడతారని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. క్రిష్ సినిమా కోసం జనవరి 4 నుంచి డేట్స్ కేటాయించాడట పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దాదాపు నెల రోజుల పాటు ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పిరియాడిక్ జోనర్లో తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక, ఫిబ్రవరి, మార్చి నెలల్లో 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. మొదటి షెడ్యూల్లోనే పవన్తో పాటు ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది.