Kushi: మాస్ థియేటర్ లో అకిరా నందన్.. అలా దొంగచాటుగా వచ్చి.. ఫొటోస్ వైరల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకిరా నందన్ కు ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను బయట ప్రపంచంలో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం అతనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇటీవల అకిరా నందన్ ఖుషి సినిమాను వీక్షించేందుకు మాస్ ధియేటర్ కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు లోకి వెళితే..

మెగా ఫ్యామిలీలో..
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా తన తండ్రి తరహాలోనే చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడతాడు అని చాలాసార్లు అర్థమైంది. అతను బాహ్య ప్రపంచంలో ఎక్కువగా రాకుండా తన ప్రైవసీ లైఫ్ తోనే ఎక్కువగా బిజీగా ఉంటాడు. ఇక అప్పుడప్పుడు కేవలం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లోనే అతను కనిపిస్తూ ఉంటాడు. అలాగే హాలిడేస్ ఉన్నప్పుడు తన తండ్రితో కూడా అతను కొంత టైం స్పెండ్ చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు.

హీరోగా వచ్చేది ఎప్పుడు?
అకిరా నందన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి అంటే అవి వైరల్ అవ్వకుండా ఉండవు. ఇక అతను హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో అని ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అతను 20 ఏళ్ల వయసులోకి రాలేదు. పూర్తిస్థాయిలో చదువు పూర్తి అయిన తర్వాతనే అతని కెరీర్ ఏమిటి అనేది అర్థమవుతుంది.
ఖుషి సినిమా చూసిన అకిరా
అయితే అకిరా నందన్ తన తండ్రికి సంబంధించిన సినిమాలను వీక్షించినట్లు ఫ్యాన్స్ కి కూడా పెద్దగా తెలియదు. కానీ ఇటీవల ఖుషి సినిమాను మాత్రం అతను చూసినట్లుగా అర్థమవుతుంది. ఒక సినిమా ధియేటర్లో అకిరా నందన్ కొంతమంది సెక్యూరిటీతో వచ్చి ఒక మాస్ థియేటర్లో సినిమాలు చూసినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దేవి థియేటర్ లో అకిరా
పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను న్యూ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రీ రిలీజ్ చేశారు. 4K వెర్షన్ లో అప్డేట్ చేసి ఈ సినిమాను చూసేందుకు ఫాన్స్ అయితే ఎగబడ్డారు. ఇక హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దేవి థియేటర్స్ లో షోను వీక్షించేందుకు చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. అయితే ఈ క్రమంలో అకిరా కూడా ఆ ధియేటర్ కు వచ్చాడు. కానీ అతను ఫ్యాన్స్ దృష్టిని ఎక్కువగా ఆకర్షించేందుకు ఎక్కువగా ఇష్టపడలేదు.
హడావిడి లేకుండా..
అకిరా నందన్ చాలా సందర్భాల్లో అయితే ఎలాంటి హడావిడి లేకుండానే బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. గతంలో తన తల్లి సోదరితో కలిసి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం సాధారణ జనాలతో నిలబడే దైవ దర్శనం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళీ ఫ్యాన్స్ తో అతను ముసుగులో వచ్చి హ్యాపీగా సినిమాను చూస్తూ ఎంజాయ్ చేశాడు. ఇక అతని ఫోటోలను మాత్రం కొంతమంది తీసారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











