Don't Miss!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- News Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
RajaniKanth : దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును గురువుతో సహా డ్రైవర్ కి అంకితం ఇచ్చిన రజనీ!
సూపర్స్టార్ రజనీకాంత్ను భారతీయ సినిమా అత్యున్నత పురస్కారం అంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. 67 వ సినిమా అవార్డుల వేడుకలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు. ఈ ప్రత్యేక సమయంలో, రజనీకాంత్తో పాటు తన గురువు దివంగత చిత్రనిర్మాత కె. బాలచందర్ లేరు కాబట్టి విచారంగా ఉన్నానని కానీ అభిమానులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారని వెల్లడించారు. అయితే రజనీకాంత్ ఈ అవార్డును అంకితం ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే
రజనీకాంత్ పేరు
ఏప్రిల్ 2021లో అప్పటి కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రజనీకాంత్ పేరును ప్రకటించారు. ఆశాభోంస్లే, సుభాష్ ఘాయ్, మోహన్ లాల్, శంకర్ మహదేవన్ మరియు బిశ్వజిత్ ఛటర్జీలతో కూడిన ఐదుగురు సభ్యుల జ్యూరీ రజనీకాంత్ పేరును నిర్ణయించింది
అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 1969లో ప్రారంభమైన హిందీ సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా పరిగణించబడుతుంది. సినిమా పితామహుడిగా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే పేరిట ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కింద, పది లక్షల రూపాయల నగదు మరియు స్వర్ణ కమల పతకం మరియు ఒక శాలువా ఇస్తారు.
మొదటి చిత్రం
ఇండియన్ సినిమాలోనే మొదటి చిత్రంగా చెప్పబడే రాజా హరిశ్చంద్రను దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు. దీంతో ఆయన పేరిట ఒక అవార్డు ఇవ్వాలని భావించి అప్పటి నుంచి అవార్డులు ఇస్తున్నారు. అవార్డు అందుకున్న క్రమంలో సౌత్ సూపర్ స్టార్, బాలీవుడ్ సినిమాల్లోనూ తనదైన ముద్ర వేసిన రజనీకాంత్కు ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వెంకయ్య నాయుడు చేతుల మీదుగా
ఇక న్యూఢిల్లీలో 67 వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో, విజేతలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్ తన భార్య లత, అల్లుడు ధనుష్తో కలిసి అవార్డు వేడుక వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో రజనీ తెల్లని దుస్తులు ధరించాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు, రజనీకాంత్ తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు నాలుగు సార్లు గెలుచుకున్నారు.
అవార్డులు రివార్డులు
రజనీకి 2000 లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ మరియు 2016 లో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. అంతేకాకుండా, గోవాలో జరిగిన 45వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రజనీకాంత్కు భారతీయ చలనచిత్ర వ్యక్తిత్వానికి సంబంధించిన శతాబ్ది అవార్డును అందించారు. ఇది కాకుండా, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కూడా మామతో పాటు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.
హృదయపూర్వక ధన్యవాదాలు
వేడుకలో మాట్లాడుతూ, రజనీకాంత్ తన అవార్డును తన గురువు కె బాలచందర్, తన అన్నయ్య సత్యనారాయణ గైక్వాడ్ మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ రాజ్ బహదూర్లకు అంకితం చేశారు. రజనీకాంత్ కండక్టర్గా ఉన్నప్పుడు కర్ణాటక బస్సు రవాణా డ్రైవర్ గా రాజ్ బహదూర్ ఉండేవారు. "ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉంది మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో నన్ను సత్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలిపారు.
Recommended Video
ఆ ముగ్గురికి
ఇక ఈ అవార్డును నా గురువు మరియు గురువు కె. బాలచందర్ సర్కు అంకితం చేస్తున్నానన్న ఆయన ఈ సమయంలో, నేను ఆయనను స్మరించుకుంటున్నానని అన్నారు. అలాగే నాకు గొప్ప విలువలు నేర్పించినందుకు మరియు నాలో ఆధ్యాత్మికతను పెంపొందించినందుకు తండ్రిలాంటి నా సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్ కు కూడా అంకితం ఇస్తానని అన్నారు. అలాగే, నా స్నేహితుడు మరియు సహోద్యోగి అయిన రాజ్ బహదూర్ బస్ డ్రైవర్, బస్ కండక్టర్ గా ఉన్న నాలోని నటుడిని గుర్తించి నన్ను సినిమాల్లోకి రమ్మని ప్రోత్సహించిన వ్యక్తి అని అన్నారు. ఇక నన్ను నమ్మి నాతో సినిమాలు చేసిన గౌరవనీయులైన దర్శకులు, నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని ఆయన అన్నారు.