Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ ఇద్దరినీ నాకు ఇచ్చినందుకు క్రిస్మస్కు థాంక్స్: విజయ్ దేవరకొండ
ఈ ప్రపంచంలో క్రిస్మస్ అనేది చాలా మందికి ప్రత్యేకమైన రోజు. అయితే టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండకు మరింత స్పెషల్. ఈ పర్వదినం రోజున జన్మించిన ఇద్దరు వ్యక్తుల వల్ల తన తన కెరీర్ ఊహించని మలుపు తిరిగింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు... టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పరశురామ్.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండను ఓ రేంజికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరశురాం దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం' సినిమాతో రూ.100 కోట్ల వసూలు చేసిన హీరోల క్లబ్లో చేరాడు విజయ్.
You both were born on the same day and gave me my biggest blockbusters :)
— Vijay Deverakonda (@TheDeverakonda) December 25, 2018
Thank you Christmas for giving me @imvangasandeep and @ParasuramPetla. Happy birthday :)) bigg huggs! pic.twitter.com/uxKGSAH4G3
ఈ విషయాన్ని గుర్తు చేసుకంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 'మీ ఇద్దరూ ఒకే రోజు జన్మించారు. ఈ ఇద్దరినీ నాకు ఇచ్చిన క్రిస్మస్కు థాంక్స్. బిగ్ హగ్ అంటూ..... ట్వీట్ చేశారు.
సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్నారు. ఇక దర్శకుడు సందీప్ రెడ్డి తెలుగులో హిట్టయిన 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. పరశురాం తన తర్వాతి సినిమా ఓ స్టార్ హీరోతో చేసేందుకు ప్లాన్ చేసుకంటున్నారు.