twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ హీరోయిన్ ఫ్యామిలీ మొత్తానికి కరోనా.. చిన్నపిల్లకే ఎక్కువ ఎఫెక్ట్ జాగ్రత్త అంటూ ఎమోషనల్ పోస్ట్

    |

    దేశంలో కరోనా కేసులు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండడం ఆరోగ్య శాఖ అధికారులతో పాటు సామాన్య ప్రజలను కూడా టెన్షన్ పెడుతోంది. సుమారు వారం రోజుల నుంచి రోజూ రెండు లక్షల పైచిలుకు కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా రెండు లక్షల 73 వేల 810 కేసులు నమోదయ్యాయి. కేసుతో పాటు కరోనా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూ పోతోంది. గడిచిన పది ఇరవై నాలుగు గంటల్లో 1619 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయిన విషయం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

    ఫ్యామిలీ మొత్తానికి కరోనా

    ఫ్యామిలీ మొత్తానికి కరోనా


    కరోనా ప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర అందులో ముంబై ప్రాంతంలో కనిపిస్తోంది. దాదాపు బాలీవుడ్ నటీనటులు అందరూ అక్కడే సెటిల్ అయిన కారణంగా తరచూ ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఒకరిద్దరు లెజెండ్రీ నటులు కరోనా కారణంగా ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్టీఆర్ తో ఒకప్పుడు వరుస సినిమాలు చేసిన నటి సమీరా రెడ్డి కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు సమాచారం. ఆమె అత్త మినహా సమీరా రెడ్డి, సమీరా రెడ్డి భర్త, సమీరా రెడ్డి ఇద్దరు పిల్లలకు కరోనా సోకినట్లు సమాచారం.

    నాలుగు రోజులు లైట్ తీసుకున్నా...

    నాలుగు రోజులు లైట్ తీసుకున్నా...

    ఈ విషయాన్ని సమీరారెడ్డి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా పంచుకుంది. చాలా మంది తన గురించి తన పిల్లల గురించి అడుగుతున్నారు అని అందుకే ఈ విషయం వెల్లడిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం హాన్స్ (ఆమె కొడుకు)కి ఫీవర్ వచ్చింది అని, తలనొప్పి , ఒళ్లు నొప్పులు కడుపులో ఇబ్బంది ఇలాంటి సమస్యలు రావడంతో ముందు మామూలుగా వచ్చినవి అని భావించినా నాలుగు రోజుల పాటు అవి కంటిన్యూ కావడంతో కరోనా టెస్ట్ చేయించామని చెప్పుకొచ్చింది. దీంతో హాన్స్ కు కరోనా పాజిటివ్ అని తేలిందని, అయితే ముందు చాలా టెన్షన్ పడినా సరే నెమ్మదిగా ధైర్యం తెచ్చుకున్నామని సమీరారెడ్డి చెప్పుకొచ్చింది. అన్నకు కరోనా సోకాక చెల్లెలికి కూడా ఈ లక్షణాలు కనిపించడంతో మామూలు జ్వరానికి జలుబు వాడే మందులు ఆమెకు వాడానని ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పుకొచ్చింది.

    జాగ్రత్త..పిల్లలకే ఎఫెక్ట్

    జాగ్రత్త..పిల్లలకే ఎఫెక్ట్

    అయితే కరోనా సెకండ్ వేవ్ గురించి చాలా అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఇందులో పిల్లలకు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోందని ఆమె చెప్పుకొచ్చింది. కానీ డాక్టర్లు ఈ సెకండ్ వేవ్ లో మైల్డ్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయని నమ్ముతున్నారని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఎక్కువగా విటమిన్ సి మల్టీవిటమిన్ తీసుకోమని డాక్టర్లు సూచిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. వారిద్దరికీ కావాల్సిన అన్ని సమకూర్చడంతో వారు త్వరగా కోలుకున్నారని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే పిల్లలకు లక్షణాలు తగ్గి పోయిన సరే 14 రోజుల పాటు కాస్త దూరంగా ఉంచాలని అలా చేస్తేనే మరొకరికి సోకకుండా ఉంటుందని చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
     అదృష్టం కొద్దీ ఆమెకు సోకలేదు

    అదృష్టం కొద్దీ ఆమెకు సోకలేదు

    అదృష్టం కొద్దీ తన అత్తగారికి కరోనా సోకలేదని ఆమెకు ఒక్కరికే నెగిటివ్ వచ్చింది అని చెప్పుకొచ్చింది. తనకు తన భర్తకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని పిల్లల నుంచి తమకు సోకినట్లు భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ సమయంలో మెడిటేషన్, ఆవిరి పీల్చడం, సాల్ట్ వాటర్ తో పుక్కిలించడం, ఊపిరి తీసుకునే వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం, కడుపునిండా కావలసిన భోజనం చేయడం లాంటి కొన్ని పద్ధతులు ఫాలో కావడంతో ప్రస్తుతానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చింది. కరోనా వస్తే నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు అని అసలు భయపడొద్దు అని మీ నుంచి మరొకరికి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.

    English summary
    Actress Sameera Reddy has been tested positive for COVID-19 including her family. After the news came to light, her social media pages were inundated with heartwarming messages from her fans and wishing her to get well soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X