Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దటీజ్ పూనమ్ పాండే.. కేరళ బాధితుల కోసం షాకింగ్ నిర్ణయం
ప్రకృతి భీభత్సంతో కేరళ రాష్ట్రం తల్లడిల్లుతున్నది. భారీ వర్షాలతో కేరళవాసుల జనజీవనం అతలాకుతలమైంది. దాదాపు 400 మంది మృత్యువాత పడ్డారు. కేరళ ప్రజల దీనస్థితికి ప్రతీ గుండే తరుక్కుపోతున్నది. ఈ నేపథ్యంలో మనసున్న ప్రతీ మనిషి వారికి సహాయం అందించడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో కేరళ వాసులను ఆదుకొనేందుకు బాలీవుడ్ నటి పూనమ్ పాండే తీసుకొన్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
ప్రస్తుతం పూనమ్ పాండే లేడీ గబ్బర్ సింగ్ అనే తెలుగు చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపింది. ఈ చిత్రానికి వీరూ కే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు వచ్చే రెమ్యునరేషన్ మొత్తాన్ని కేరళ వరద బాధితుల సహాయార్థం ఇచ్చేస్తున్నాను అని పూనమ్ పాండే వెల్లడించింది.
కేరళలో వరద బీభత్సం చూసి హృదయం తల్లడిల్లుతున్నది. తీవ్రమైన బాధతో ఆవేదనకు గురయ్యాను. వరదల్లో చిక్కుకొని ఆకలితో బాధపడుతున్న వారికి చేయూతను ఇవ్వాలని నా మనసు పరితపిస్తున్నది. ఈ నేపథ్యంలో లేడీ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించినందుకు వచ్చే రెమ్యునరేషన్ పూర్తిగా ఇచ్చేస్తున్నాను. కేరళవాసులను ఆదుకోవడానికి చాలా మంది రంగంలోకి దిగడం చాలా సంతోషంగా ఉంది.
కేరళవాసులను ఆదుకోవడానికి, వారికి సహాయం అందించడానికి ముందుకు రావాలని సినీ పరిశ్రమ పెద్దలను, నా స్నేహితులను, ఫ్యాన్స్ను వేడుకొంటున్నాను అని పూనమ్ పాండే అన్నారు. కేరళ వరద బాధితులకు షారుక్ ఖాన్కు చెందిన మీర్ ఫౌండేషన్ రూ.21 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది.