Don't Miss!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- News UN On Arvind Kejriwal: కేజ్రివాల్ అరెస్టుపై స్పందించిన ఐరాస-భారత్ కు కీలక సూచన..!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఏంజెల్ ఆర్న తరువాత మళ్లీ ఇలా.. మారుతిపై రాశీ ఖన్నా కామెంట్స్
ప్రతీరోజూ పండగే అనే సినిమాతో రాశీ ఖన్నా తనలోకి కామెడీ యాంగిల్ను బయటపెట్టేసింది. దర్శకుడు మారుతి అప్పటి ట్రెండ్ అయిన టిక్ టాక్ పిచ్చిని రాశీ ఖన్నా పాత్రలో చూపించాడు. అలా ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశీ ఖన్నా సరిగ్గా సరిపోయింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు రాశీ ఖన్నా పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే మళ్లీ మారుతి దర్శకత్వంలోనే రాశీ ఖన్నా మరో చిత్రంతో నటిస్తోంది.
జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో
ప్రస్తుతం మారుతి గోపీచంద్తో పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని చేస్తోన్నాడు. మొదటగా ఈ సినిమా కోసం రవితేజను హీరోగా అనుకున్నారు. కానీ రవితేజ ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో చివరకు గోపీచంద్ వద్దకు ప్రాజెక్ట్ వెళ్లినట్టు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే మొత్తానికి గోపీచంద్తో అదిరిపోయే కమర్షియల్ సినిమాను మారుతి తీయబోతోన్నాడు.
ఈ మూవీ షూటింగ్లో తాజాగా రాశీ ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో మళ్లీ పని చేయడంతో రాశీ ఖన్నా స్పందించింది. ఏంజిల్ ఆర్నా తరువాత మళ్లీ అదిరిపోయే పాత్రలో చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్లో రెండు ప్రాజెక్ట్లు, హిందీ వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. మొత్తానికి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో రాశీ ఖన్నా దూసుకుపోతోంది.