Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్ ఆఫర్లను రిజెక్ట్ చేసిన రష్మిక.. కారణం అదేనట!
కిరిక్ పార్టీ చిత్రంతో కన్నడ సినీ రంగంలోకి దూసుకొచ్చిన రష్మిక మందన్న చలో సినిమాతో టాలీవుడ్లో పాగా వేసింది. తాజాగా విజయ్ దేవరకొండతో కలసి నటించిన గీతా గోవిందంతో ఓ బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకొన్నది. కెరీర్ ఆరంభంలోనే 100 కోట్ల క్లబ్లో చేరిన యువ హీరోయిన్గా ఓ ఘనతను సాధించింది.
ప్రస్తుతం కన్నడ, తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టిన రష్మికకు బాలీవుడ్ నుంచి ఓ బ్రహ్మండమైన ఆఫర్ వచ్చిందట.
కథ, పాత్ర నచ్చకపోవడంతో బాలీవుడ్ చిత్రాన్ని అంగీకరించలేదని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. కథ, పాత్ర బాగుండి. తన కెరీర్కు దోహదపడితే ఏ భాషలోనైనా నటిస్తాను అని ఇటీవల రష్మిక చెప్పింది.
గీతా గోవిందం చిత్రం తర్వాత టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో వస్తున్న దేవదాస్ చిత్రంలో రష్మిక నటిస్తున్నది. ఈ చిత్రంలో నానికి జోడిగా కనిపించబోతున్నారు.
గీతా గోవిందం తర్వాత మరోసారి విజయ్ దేవరకొండతో జతకట్టి డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక నటిస్తున్నది. అలాగే యజమన అనే కన్నడ చిత్రంలో కూడా నటిస్తున్నది. ఈ చిత్రం నిర్మాణ దశలోనే ఉంది. అంతేకాకుండా మరికొన్ని స్క్రిప్టులను వింటున్నట్టు ఇటీవల చెప్పడం గమనార్హం.