twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రంగులద్దుకున్నా’.. ఎస్పీబీకి అంకితం.. దేవీ శ్రీ ప్రసాద్ ఎమోషనల్

    |

    రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతంపై ఆ మధ్య ఎంతగా ట్రోలింగ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా తమన్ సంగీతం, ఆల్బమ్స్‌తో పోలికలు పెడుతూ దేవీని ట్రోల్ చేసేవారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సంగీతాన్ని, పాటలు పోల్చుతూ సోషల్ మీడియాలో బాగానే చర్చ నడిచింది. అయితే తన నుంచి రాబోతోన్న సినిమాల్లో సంగీతం కొత్తగా ఉంటుందని ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. చెప్పినట్టుగానే దేవీ శ్రీ ప్రసాద్ ఉప్పెన పాటలతో సంగీత ప్రియుల్ని అలరిస్తున్నాడు.

    ఇప్పటికే రిలీజ్ చేసిన ఉప్పెన పాటలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన రంగులద్దుకున్న అనే పాట కూడా బాగానే ఆకట్టుకుంటోంది. నిన్న విడుదల చేసిన లిరికల్ ప్రోమోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. తాజాగా ఈ పాటను మహేష్ బాబు తన సోషల్ మీడియా ఖాతాల్లో రిలీజ్ చేశాడు. ఉప్పెన నుంచి లవ్లీ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాను.. నా ఫేవరేట్ రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్.. సుకుమార్ గారు.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి బుచ్చి బాబు సన అందరికీ కంగ్రాట్స్ అని తెలిపాడు.

    Devi Sri Prasad Dedicates Ranguladdhukunna Uppena Song To SPB

    మహేష్ బాబు అందించిన విషెస్‌కు దేవీ శ్రీ ప్రసాద్ రియాక్ట్ అయ్యాడు. ఉప్పెన నుంచి రంగులద్దుకున్నా అనే పాట రిలీజ్ చేసినందుకు థ్యాంక్యూ అండ్ లవ్యూసూపర్ స్టార్.. అని దేవీ ట్వీట్ చేశాడు. లాక్డౌన్ తరువాత విడుదలైన నా మొదటి పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సర్‌కి అంకితం చేస్తున్నాను అని చెప్పాడు. ఈ పాటలో సంగీతం సాహిత్యమే కాదు విజువల్స్, హీరో హీరోయిన్ల ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి.

    English summary
    Devi Sri Prasad Dedicates Ranguladdhukunna Uppena Song To SPB,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X