Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాస్కో సాంబా ఈ పాట మామూలుగా ట్రెండ్ అవదు.. రామ్జో ట్వీట్ వైరల్
రామ జోగయ్య శాస్త్రి అంటే ఎన్నో పాటలు స్మృతిలోకి వస్తాయి. సదాశివ సన్యాసి అనే పాటతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేసిన రామ జోగయ్య శాస్త్రి.. తాజాగా బుట్టబొమ్మ పాటతో అందర్నీ తన బుట్టలో వేసుకున్నారు. తమన్, రామ జోగయ్య శాస్త్రి కాంబోలో వచ్చిన అన్ని పాటలు దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్టే అయ్యాయి. అయితే మరోసారి ఈ ద్వయం కలిసికట్టుగా రాబోతోంది.
పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తోన్న పింక్ రీమేక్ చిత్రానికి తమన్, రామజోగయ్య శాస్త్రి కలిశారు. వీరితో పాటు సామజవరగమన అంటూ తెలుగు రాష్ట్రాలను తన గాత్రంతో ఊపేసిన సిద్ శ్రీరామ్ కూడా తోడయ్యాడు. ఇక ఈ పాట ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. ఇదే విషయాన్ని తమన్ సోషల్ మీడియాలో చెబుతూ.. మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నట్టు పేర్కొన్నాడు.
ఈ క్రమంలోనే ఓ పిక్ను కూడా షేర్ చేశాడు. ఎంతో కూల్గా ఉన్న సిద్ శ్రీరామ్, తమన్.. ఈసారి మరో సెన్సేషన్తో రాబోతోన్నట్టు తెలుస్తోంది. పవన్ కోసం కంపోజ్ చేసే ఈ పాట ట్రెండ్ అవ్వాల్సిందేనంటూ నెటిజన్లు కోరుతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే రామ జోగయ్య శాస్త్రి రిప్లై ఇస్తూ.. రాస్కో సాంబా ఈ పాట మామూలుగా ట్రెండ్ అవదు అని పేర్కొన్నాడు. మరి ఈ పాట ఎన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Raasko sambaa
— RamajogaiahSastry (@ramjowrites) February 13, 2020
Ee paataa మామూలుగా ట్రెండ్ అవదు ... https://t.co/Q3lLpRDOxj