Don't Miss!
- News సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Automobiles ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం.. అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
నిరాహార దీక్ష ప్రారంభంచిన ‘24’ చిత్ర నిర్మాత!
చెన్నై: సూర్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '24' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని సినిమాల్లానే ఈ సినిమాను పైరసీ భూతం వెంటాడుతోంది.
'24' చిత్రం విడుదలైన రోజు భారీ ఎత్తున పైరసీ సీడీలు బయటకు వచ్చాయి. దీంతో పైరసీకి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్ర నిర్మాత జ్ఞాన్ వేల్ రాజా చెన్నైలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు.
థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్, ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా...బెంగుళూరులోని పీవీఆర్ ఓరియన్ మాల్ లో సినిమా విడుదల రోజైన మే 6న 9.45 గంటలషోను పైరసీ దారులు రికార్డు చేసినట్లు గుర్తించినట్లు రాజా తెలిపారు.
శుక్రవారం సాయంత్రం నుండే నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జ్ఞాన్ వేల్ రాజా ప్రకటించారు. పైరసీని పరిశ్రమ సీరియస్ గా తీసుకోవాలని, పరిశ్రమ పెద్దలు స్పందించి సరైన చర్యలు తీసుకునే వరకు తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు.
ఈ మధ్య సౌత్ సినీ పరిశ్రమల్లో పైరసీ తీవ్రరూపం దాల్చింది. సినిమా విడుదలైన రోజే సీడీలు మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు విడుదల కాక ముందే ఎడిటింగ్ రూమ్ నుండి బయటకు లీక్ అవుతున్నాయి. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.