Don't Miss!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాహుబలి2కి దంగల్ షాక్.. బాక్సాఫీస్ యుద్ధం మొదలైంది.. 9 వేల స్క్రీన్లలో అమీర్ సినిమా!
బాక్సాఫీస్ వద్ద అసలు యుద్దం ఇప్పుడే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తుంటే, బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన సత్తాను చూపించేందుకు సిద్ధమయ్యాడు.
బాక్సాఫీస్ వద్ద అసలు యుద్దం ఇప్పుడే మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ప్రభంజనం సృష్టిస్తుంటే, బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన సత్తాను చూపించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే అమీర్ ఖాన్ నటించిన పీకే వసూలు చేసిన రూ.792 (గ్రాస్) కోట్లను బాహుబలి తిరుగరాసింది. ఈ నేపథ్యంలో దంగల్ చైనాలో రికార్డు స్థాయిలో 9 వేల స్క్రీన్లలో శుక్రవారం (మే 5వ తేదీన) విడుదలవ్వడం రికార్డుగా నమోదైంది.
నోట్ల రద్దు సమయంలో..
అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2016 డిసెంబర్ 23న విడుదలైంది. నోట్ల రద్దు అనంతరం అనేక సినిమాలు కుప్పకూలితే.. దంగల్ మాత్రం సంచలన విజయం నమోదు చేసుకొన్నది. డిమానిటైజేషన్ తర్వాత నెలకొన్న పరిస్థితుల ఎదురించి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ. 744 కోట్లు వసూలు చేసింది. పీకే సాధించిన రూ.792 కోట్ల తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
చైనాలో అమీర్ హవా..
చైనా మూవీ మార్కెట్లో మరే బాలీవుడ్ నటుడికి లేని విధంగా అమీర్ ఖాన్ మంచి మార్కెట్ ఉంది. గతంలో పీకే చిత్రం చైనాలో దాదాపు 4 వేల స్క్రీన్లలో విడుదలైంది. దాదాపు వంద కోట్ల రూపాయాలను కలెక్ట్ చేసింది. చైనా వ్యాప్తంగా దాదాపు 40 స్క్రీన్లు ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన బీజింగ్ పిల్మ్ ఫెస్టివల్లో దంగల్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన కోసం అమీర్ ఖాన్ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
9 వేల స్క్రీన్లలో..
ఈ శుక్రవారం (మే 5న) దంగల్ చిత్రం ష్యూ జియో బాబా (కుస్తీ పట్టు పడుదామా నాన్నా అని అర్థం) పేరుతో దాదాపు 9 వేల స్కీన్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి విడుదలైన స్కీన్లతో ఈ మొత్తం సమానం. దీన్ని బట్టి చైనాలో అమీర్ ఖాన్కు ఉన్న స్టామినా ఎంటో మరోసారి స్పష్టమైంది.
ఫోగట్ జీవిత కథ ఆధారంగా..
హర్యానాకు చెందిన కుస్తీ యోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. తన కూతుర్లకు ఫోగట్ స్వయంగా కుస్తీ శిక్షణ ఇచ్చి ప్రపంచ చాంపియన్లుగా తయారు చేసిన వాస్తవ కథ ఆధారంగా దంగల్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తక్కువ బడ్జెట్తో రూపొందిన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భారీ కలెక్షన్లను సాధించింది. భారతీయ సినిమా పరిశ్రమలో దంగల్ నమోదు చేసిన రికార్డులును ఇటీవల విడుదలైన బాహుబలి ది కన్క్లూజన్ తిరగరాసింది.
చైనాలో ఇది ఓ రికార్డు..
చైనాలో అమీర్ ఖాన్కు ఉన్న ప్రేక్షకాదరణ దృష్ట్యా దంగల్ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ‘దంగల్ చిత్రాన్ని చైనాలో 9 వేల థియేటర్లలో విడుదల చేశాం. ఇతర దేశాల్లో భారతీయ చిత్రం సాధించిన అరుదైన రికార్డు ఇది. ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో అనే విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆదరించే కథా బలం ఉన్న సినిమా ఇది అని డిస్నీ ఇండియా వైస్ ప్రసిడెంట్, చిత్ర సహనిర్మాత అమృత పాండే మీడియాతో అన్నారు.