Don't Miss!
- Lifestyle పుచ్చకాయ జ్యూస్ లో ఈ ఒక్కటి కలిపి తాగితే చాలు వేసవి ఆరోగ్య సమస్యలు బలాదూర్..మీ శరీరానికి శాంతం..ఉపశమనం
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేశ్ ఫాలో అయ్యేది ఒక్కరినే.. ఆయన ఎవరో తెలుసా.. ట్విట్టర్లో ప్రిన్స్ రికార్డు..
మహేశ్ ఫాలో అయ్యేది ఒక్కరినే.. ఆయన ఎవరో తెలుసా.. ట్విట్టర్లో ప్రిన్స్ రికార్డు.. సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రిన్స్ మహేశ్బాబును ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉంటారు.
మహేశ్ ఫాలో అయ్యేది ఒక్కరినే.. ఆయన ఎవరో తెలుసా.. ట్విట్టర్లో ప్రిన్స్ రికార్డు..
సినీ పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రిన్స్ మహేశ్బాబును ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉంటారు. కానీ మహేశ్ ఎవరని ట్విట్టర్లో ఎవరినీ ఫాలో అవుతారో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే. ట్విట్టర్ అకౌంట్లో మహేశ్ ఫాలోవర్స్ 30 లక్షల మంది ఉండగా, ఆయన ఫాలో అవుతున్నది మాత్రం కేవలం ఒక్కడంటే ఒక్కరినే. అతను ఎవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్. ఈయన ప్రిన్స్ మహేశ్కు బావ అన్నది తెలిసిందే.
ప్రిన్స్ మహేశ్ అకౌంట్లో 30 లక్షలు..
ఇంటర్నెట్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి అకౌంట్లతో అభిమానులను చేరుకోవడం సులభమైంది. తాజాగా మహేశ్ బాబు ట్విట్టర్లో అరుదైన ఘనతను సాధించాడు. ప్రిన్స్ అకౌంట్లో 30 లక్షల మంది ఫాలో అవ్వడం ఓ రికార్డు.
రజనీకాత్ సరసన మహేశ్
దక్షిణాదిలో సోషల్ మీడియాలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నటుల్లో రజనీకాంత్, ధనుష్, సమంత, శృతిహాసన్ లాంటి వారు ఉన్నారు. వీరందరూ మూడు మిలియన్ల క్లబ్ చేరారు. తాజాగా ఈ క్లబ్లో మహేశ్ బాబు చేరారు. ఈ జాబితాలో చేరిన తొలి తెలుగు హీరో మహేశ్ కావడం గమనార్హం.
ట్విట్టర్లో రెగ్యులర్ అప్డేట్స్
ట్విట్టర్లో ప్రిన్స్ ఎప్పటికప్పుడు తన విషయాలను అభిమానులతో పంచుకొంటారు. సేవా కార్యక్రమాలు, వినోద పర్యటనలు తదితర అంశాలను రెగ్యులర్గా అప్ డేట్ చేస్తుంటారు.
మురుగదాస్ చిత్రంతో బిజిబిజీ
మహేష్ ప్రస్తుతం మురుగదాస్ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు చేరువకానున్నారు. మహేష్ చిత్రం జూన్ 23న విడుదలకు ముస్తాబవుతున్నది. ఆ తర్వాత కొరటాల శివ, వంశీ పైడిపల్లి రూపొందించే చిత్రాలపై మహేశ్ దృష్టిపెట్టే అవకాశం ఉంది.