Don't Miss!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- News వివేకా హత్యపై మాట్లాడొద్దు- కడప కోర్టు సంచలన ఆదేశాలు..!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వేణు మాధవ్ చనిపోతే నేను ఎవర్ని? సాక్ష్యాలు చూపుతూ ఫైర్ (వీడియో)
హైదరాబాద్: "గత కొంత కాలంగా అనారోగ్యానికి గురైన వేణు మాధవ్ ఇక మనకు లేడు. నిమ్స్ ఆసుపత్రిలో చివరి సారిగా మాట్లాడిన వేణు మాధవ్".... కొన్ని ఛానల్స్, వెబ్ సైట్లలో ఈ న్యూస్ చూసి యాత్ తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు చివరకు వేణు మాధవ్ కూడా షాకయ్యారు.
పూర్తి ఆరోగ్యంగానే ఉన్న వేణు మాధవ్....మంగళవారం ఉదయం తాను చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారంపై కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇలా మీడియా ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు.
మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన గుండుతో కనిపించారు. మీడియాతో వేణుమాధవ్ మాట్లాడుతూ.. మీరు అడగవచ్చు. కేన్సర్ లేకుంటే గుండెందుకు చేయించుకున్నారని..నేను మొన్న తిరుపతి వెళ్లాను. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని బాలయ్య గారి 100వ సినిమా.. చిరంజీవిగారి 150 సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మొక్కుకుని ఆ భగవంతుడిని కోరుకున్నాను అని తెలిపారు.
Actor Venu Madhav Complaints about the Rumors..!! pic.twitter.com/NQZg52Yaxf
— Suresh Kondi (@V6_Suresh) May 10, 2016
నేను చనిపోయినట్లు ప్రచారం చేస్తున్నారు. మరి ఇప్పుడు మీ ముందు మాట్లాడుతుంది వేణుమాధవా? లేక వాడి తమ్ముడా? లేక వాడి బావమరిదా? నాపై ఈ దుష్ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఎవరెవరు చేశారో వారందరిపైనా కేసు పెట్టడం జరిగింది" అని వేణుమాధవ్ అన్నారు.