నటి షాలు మీనన్కు నో బెయిల్!

గత నెల రోజులుగా సోలార్ ప్యానెల్ కుంభకోణం గత నెలలో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఆమె పేరు నానుతూ వస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు బిజూ రాధాకృష్ణన్తో ఆమెకు సంబంధాలున్నాయంటూ దుమారం చెలరేగుతోంది. గత శుక్రవారం షాలు మీనన్ను అరెస్టు చేసారు.
పోలీసులు కొట్టాయం సమీపంలోని చంగనసెస్సెరీలో గల ఆమె నివాసానికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆమెను ఎడిజిపి హేమచంద్రన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం చెంగన్నూరు తీసుకుని వెళ్లింది. షాలుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని త్రిసూరు మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి దర్యాప్తు అధికారులు ఆమెపై ఓ కన్నేసి ఉంచారు. బిజూ రాధాకృష్ణన్ రాష్ట్రం నుంచి పారిపోవడానికి ఆమె సహకరించడానికి సిద్ధపడినట్లు పోలీసులు అనుమానించారు. అనుమానాస్పద స్థితిలో మరణించిన భార్య మృతి కేసులో కూడా బిజూ కోసం పోలీసులు వేట సాగిస్తూ వచ్చారు.


Click it and Unblock the Notifications











