Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రాణాలతో గట్టెక్కిన హీరోయిన్, ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్య
బెంగుళూరు: కన్నడ హీరోయిన్ వింధ్య ఇటీవల ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. దాదాపు 70కి పైగా నిద్రమాత్రలు మింగిన ఆమె చికిత్స అనంతరం ప్రాణాలతో బయట పడింది. ఇపుడు కోలుకోవడంతో ఆసుపత్రి నుండి కూడా డిశ్చార్జి చేసారు. వ్యక్తిగత కారణాలతో ఆమె మార్చి 4వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వింధ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిందనే విషయం గమనించిన వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను బెంగుళూరు శివాజీ నగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిచారు. ఆమెను బ్రతికించేందుకు చికిత్స చేసిన వైద్యులు దాదాపు మూడు రోజులు పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఆదివారం (మార్చి 9)న ఉదయం డిశ్చార్జి చేసారు.
ఆత్మహత్యాయత్నం సంఘటనపై స్పందించేందుకు వింధ్య నిరాకరించారు. భవిష్యత్లో తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని ఆమె తెలిపారు. సినిమా పరిశ్రమలోకి ఎందుకు వచ్చానా అని ఇపుడు బాధ పడుతున్నానని, ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆమె తెలిపారు. వింధ్య తల్లిదండ్రులు గత కొంతకాలంగా దృష్టి సంబంధ లోపంతో బాధ పడుతున్నారు. వింధ్య ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సమయంలో ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
మనెదమరయల్లి అనే కన్నడ చిత్రంలో హీరోయిన్గా నటించిన వింద్య అదే చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన మంజునాథ్తో స్నేహం చేసింది. ఈ క్రమంలో వీరి స్నేహం ప్రేమగా మారిందని తెలుస్తోంది. అయితే మంజునాథ్ వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని వింద్య తల్లిందండ్రులు రంగస్వామి, నాదమ్మ ఆరోపిస్తున్నారు.
మంజునాథ్ అసలు స్వరూపం తెలియడంతో వింధ్య గత కొంత కాలంగా అతనికి దూరంగా ఉంటోందని, దీంతో మంజునాథ్ ఫోన్లో వేధించడం మొదలు పెట్టాడని, మంగళవారం ఉదయం అతని నుండి కాల్ రావడంతో మాట్లాడిన వింద్య అనంతరం గదిలోకి వెళ్లి ఏడ్చిందని, అనంతరం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిందని తెలుస్తోంది.