Don't Miss!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- News గంటా Vs అవంతి, బిగ్ ఫైట్ - గురు శిష్యుల్లో గెలిచేదెవరు..!?
- Finance Insurance Company: ఈ శని, ఆదివారాలు తెరిచి ఉండనున్న బీమా కంపెనీలు..
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
జియా ఖాన్ తల్లిపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా
ఈ నేపథ్యంలో నటుడు ఆదిత్య పంచోలి రబియా ఖాన్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు బాంబే హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసారు. ట్విట్టర్లో తమపై రబియా అమర్యాదపూర్వకంగా వ్యాఖ్యలు చేస్తోందని, ఆమె చర్యల కారణంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో, సమాజంలో పరువు పోతోందని పిటీషన్లో పేర్కొన్నారు.
జియా ఖాన్ కేసు విషయానికొస్తే...
జియాఖాన్(25) మృతి కేసును బాంబే హైకోర్టు గురువారం బదిలీ చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయూర్తులు విఎం కనడే, పిడి కోడేలు జియాఖాన్ మృతి కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలని సిబిఐని ఆదేశించారు.
జియాఖాన్ మృతి కేసు విచారణను సిబిఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియాఖాన్ 2013, జూన్ 3న ముంబైలోని జుహూలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించారు.
జియాఖాన్ నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు, జియాఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సూసైడ్ నోట్ జియా రాసింది కాదని ఆమె తల్లి రబియా ఆరోపించారు. జియాఖాన్ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐచే విచారణ కొనసాగించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సిబిఐకి ఈ కేసును బదిలీ చేసింది.