Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ ‘దూకుడు’ పూర్తవగానే బిజినెస్ మొదలెడుతాడట...
ప్రిన్స్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన బ్లాక్ బ్లస్టర్ 'పోకిరి'. ఆ సినిమా తరవాత వారిద్దరు వారి వారి సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు. పోకిరి సినిమా విడుదలైన ఐదు సంవత్సరాల తరవాత ఇప్పుడు పూరి, మహేష్ కాంబినేషన్లో 'ది బిజినెస్ మాన్' అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా జూలై నెలలో సెట్స్ ఫై కి వెళ్ళనుంది.
మే నెలలోనే మొదలవ్వవలసిన ఈ సినిమా సినీకార్మికుల సమ్మె తదితర కారణాల వల్ల జూలై నెలకు వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ బ్యానర్ ఫై వెంకట్ నిర్మిస్తున్నారు. మహేష్ సరసన శృతి హసన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.
ప్రస్తుతం మహేష్ 'దూకుడు' పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అలాగే పూరి జగన్నాథ్ కూడా అమితాబ్ తో 'బుడ్డా' రూపొందించే పనిలో తలమునకలై ఉన్నాడు. జూన్ నెలాఖరుకు దూకుడు, బుడ్డా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి ఆ తరవాత బిజినెస్ మాన్ మొదలవుతుందని తెలుస్తుంది.