Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'భాయ్' దర్శకుడు నెక్ట్స్ ఖరారు...డిటేల్స్
హైదరాబాద్ : నాగార్జున 'భాయ్' చిత్రంతో డిజాస్టర్ ఫలితం అందుకున్న దర్శకుడు వీరభధ్రమ్ తన తదుపరి చిత్రానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. అల్లరి నరేష్ హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రానికి భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. రకుల్ ప్రీత్సింగ్ని హీరోయిన్ గా ఎంచుకొన్నట్టు సమాచారం.
ఈ మధ్యే నరేష్కి కథ వినిపించి ఓకే చేయించుకున్నారు దర్శకుడు. నరేష్ శైలిలోనే ఆద్యంతం వినోదాలు పంచే చిత్రమిదని తెలుస్తోంది. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. శ్రీధర్ సీపాన సంభాషణలు అందిస్తారు. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
గతంలో వీరిద్దరూ 'అహ నా పెళ్లంట' సినిమాకు కలిసి పనిచేశారు. దాంతో ఈ కాంబినేషన్ తో బిజినెస్ వర్గాల్లో క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. మొదట వీరభధ్రమ్..గోపిచంద్ కాంబినేషన్ లో చిత్రం అని వార్తలు వచ్చాయి. కానీ గోపీచంద్ ఆసక్తి చూపకపోవటంతో సినిమా పట్టాలు ఎక్కలేదు.