Don't Miss!
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Finance Gold Rate: పిచ్చెక్కిస్తున్న పసిడి ధరలు.. నేడు మళ్లీ పెరుగుదల.. రూ.4,900 అప్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- News కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ముఖ్యులెవరు..!!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అందుకు అల్లు అరవింద్ అమ్మగారే కారణం...పవన్ కళ్యాణ్
నేను ఈ రోజు ఇలా వేదికపై నిలుచున్నానంటే అందుకు కారణం మా అత్తయ్య. అల్లు అరవింద్ అమ్మగారైన ఆమె నన్ను కల్యాణి అని పిలిచేవారు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడే కల్యాణిని సినిమాల్లోకి తీసుకెళ్లాలి అంటూ ఉండేవారు అంటూ ఉద్వేగంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్. సోమవారం రాత్రి హైదరాబాద్లో 'తీన్మార్' పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ ఆవిష్కరించి పవన్కల్యాణ్కి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ ఇలా స్పందించారు. అలాగే...సమాజానికి మనం ఉపయోగపడాలనే స్ఫూర్తిని నింపిన వ్యక్తి మా అమ్మగారు. రోజూ సంధ్య వేళ దీపం పెట్టి దండం పెట్టుకొనేవారు. ఎవరికి దండంపెడుతున్నావంటే బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్కి అని చెప్పేవారు అన్నారు. ఇక నేను చేసే ప్రతి సినిమా అభిమానులను దృష్టిలో ఉంచుకొనే ఉంటుంది. వాళ్ల సంతృప్తే నాకు ముఖ్యం. అలా అని విచ్చలవిడిగా సినిమాలు చేయటమంటే నాకు చాలా భయం. నేను చేసే ప్రతి సినిమా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలని కోరుకొంటాను అన్నారు.