Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బన్నీ లింగుసామి కే ఆ ఆఫర్ ఎందుకిచ్చినట్టు..?
"హీరోల్లో రాజ్ కుమార్ ఫ్యామిలీ అంటే ఇష్టం. ఆ ఫ్యామిలీ హీరోలతో కలిసి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. త్వరలోనే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం చేయబోతున్నాను. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం." 'సరైనోడు' చిత్రం విడుదల సందర్బంగా బెంగుళూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో అల్లు అర్జున్ చెప్పిన సంగతి తెలిసిందే..
బన్నీకి ఇతర రాష్ట్రాలోనూ అభిమానులు ఎక్కువ గానే ఉన్నారు. దీంతో అందరు అభిమానుల కోసం ఓ ద్విభాష చిత్రాన్ని చేయాలని బన్నీ ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆ కోరిక ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది. దర్శకులు లింగుసామి, విక్రమ్ కుమార్లు అల్లు అర్జున్ కోసం చకచకా కథలు సిద్ధం చేశారు. గత కొంతకాలంగా వీరిద్దరితోనూ కథా చర్చలు జరుపుతున్న బన్నీ చివరికి విక్రమ్ కుమార్ ఇచ్చిన కథని కాదని లింగుసామికే ఓటేశాడని ఫిల్మ్నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఇష్క్, మనం లాంటి విభిన్న కథలతో వరుస విజయాలను అందుకున్న విక్రమ్ కుమార్ని కాదని నిర్మాతగా మారి ఫ్లాప్ లలో ఉన్న లింగుసామి ని ఎన్నుకొవటం కాస్త వింతగానే అనిపించినా, లింగుసామి చెప్పిన లవ్ స్టోరీ బన్నీ కి బాగా కనెక్గ్ అయ్యిందట. దాంతొ వెంటనే పచ్చజండా ఊపేసాడట ఈ సరైనోడు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే లవ్ స్టోరీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి....