Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫ్రెండ్ కోసం...కోర్టులో మెట్లక్కబోతున్న అక్కినేని అమల…!
హైదరాబాద్ : మాజీ హీరోయిన్, హీరో నాగార్జున అక్కినేని సతీమణిగా, అఖిల్ కి తల్లిగా అమల అక్కినేని గత ఇరవై ఏళ్లుగా భాధ్యతలు నిర్వహిస్తూ సినిమాలను దూరం పెడుతూ వస్తున్నారు. అయితేత రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ మలయాళ సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. అమల తాజాగా ఓ మలయాళ సినిమాలో న్యాయవాది పాత్రను పోషిస్తున్నారని సమాచారం. తన స్నేహితురాలు మంజు వారియర్ కోసమే ఆమె ఈ సినిమా కమిటైందని సమాచారం.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది అమలా అక్కినేని. ఆంటోనీ సోనీ సారధ్యంలో డెబ్యూ మూవీగా వస్తున్న చిత్రం 'కేరాఫ్ సైరాబాను' అనే చిత్రంలోఆమె నటించనున్నారట. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో ఆనీ జాన్ అనే న్యాయవాది పాత్రలో అమలా కనిపించనుంది.
ఇప్పటికే స్క్రిప్టు, ప్రీపొడక్ష పనులన్నీ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ ఈ త్వరలోనే మొదలు కానుందని వివరించాయి.