Don't Miss!
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
జీవితాలతో ఆడుకోవద్దు: కోడి పందాలపై అక్కినేని అమల
హైదరాబాద్: ప్రకృతి ప్రేమికురాలిగా, జంతు ప్రేమికురాలిగా పేరుతున్న అక్కినేని అమల గత కొంత కాలంగా జంతువుల రక్షణ కోసం ‘బ్లూ క్రాస్' అనే సంస్థను కూడా రన్ చేస్తోంది. స్టార్ హీరో నాగార్జున్ భార్య అయినప్పటికీ తనదైన దారిలో నడుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
తాజాగా సంక్రాంతి సంబరాల్లో చోటు చేసుకుంటున్న ఓ విషయం ఆమెను తీవ్రంగా బాధించింది. అది మరేదో కాదు కోడి పందాలు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడంపై ఆమె విచారం వ్యక్తం చేసారు. కోడి పందాలు నిర్వహించడం అంటే కోళ్ల జీవితాలతో ఆడుకోవడమే. వాటిని హింసిస్తూ ఎంజాయ్ చేయడం క్రూరత్వమైన చర్య అని ఆమె అబిప్రాయ పడుతున్నారు.
కాగా...కోడి పందాలు సాధారణంగా నిర్వహించుకోవచ్చని ఇటీవల కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయిదే కోడి పందాలపై బెట్టింగ్ పెట్టొద్దని, వాటికి కాళ్లకు కత్తులు లాంటి కట్టొద్దని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అయితే చాలా చోట్ల బెట్టింగ్ రూపంలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని తెలుస్తోంది.
మరికొన్నిచోట్ల కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి వాటిని పందాల్లో విడుస్తున్నారు. ఈ కారణంగా అవి తీవ్ర గాయాలపాలైన మరణిస్తున్నాయి. ఈ పరిణామాలపై అమల విచారం వ్యక్తం చేసాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి అరికట్టడంలో విఫలం అయందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.