Don't Miss!
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తుపాకీ తూటాల పేలుళ్ళ మధ్య...
గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన అనురాధ ఫిలింస్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం రోజ్ గార్డెన్. ప్రస్తుతం ఈ చిత్రంతో కాశ్మీర్లో చిత్రీకరణను జరుపుకుంటుంది. చదలవాడ తిరుపతిరావు సమర్పణలో చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ల మధ్య యుద్ద వాతావరణం కలిగి ఉంది. కాశ్మీర్లో అడుగుపెట్టడానికే భయం నెలకొన్న సమయంలో ధైర్యంగా, సాహసంగా ఈ చిత్రం పూర్తిగా కాశ్మీర్లోనే చిత్రీకరణ జరుపుకోవటం విశేషం.
దర్శకుడు జి.రవికుమార్(బాంబే రవి) మాట్లాడుతూ... కాశ్మీర్ మొత్తం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాత్రమే సాహసంతో ఈ చిత్రాన్ని కాశ్మీర్లో నిర్మిస్తుండటం విశేషం. అలాగే కాశ్మీర్ ప్రభుత్వంతో నిర్మాతలకు ఉన్న అనుబంధం కారణంతో దాదాపు 120 మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ చేస్తున్నాం. కాశ్మీర్ ప్రభుత్వం సహకారంతో ప్రభుత్వం అందిస్తున్న భారీ భద్రత మధ్య సహకారంతో ఏ టెన్షన్ లేకుండా చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రీకరణలో సైన్యానికి చెందిన ఆయుధాలనే ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.