తన మరణం తర్వాత ఆస్తుల పంపకంపై... మెగాస్టార్ ట్వీట్!
మార్చి 8న ఉమెన్స్ డే నేపథ్యంలో వారికి మద్దతుగా అమితాబ్ ఈ ట్వీట్ చేసారు. అమితాబ్ ట్వీట్ మీద మహిళా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాజాగా ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశం అయింది. తన మరణం అనంతరం తన ఆస్తులు ఎలా పంచాలనే విషయమై పేర్కొంటూ ఆయన ఈ ట్వీట్ చేసారు.
నా మరణం తర్వాత నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు అభిషేక్ బచ్చన్, నా కుమార్తె శ్వేతాకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే... అంటూ ఓ ప్లకార్డు ప్రదర్శిస్తూ అమితాబ్ బచ్చన్ ఈ ట్వీట్ చేసారు.
అమితాబ్ ట్వీట్ ఇదే
అమితాబ్ లాంటి ఒక నేషనల్ స్టార్ ఇలాంటి మంచి ట్వీట్ చేయడంపై స్త్రీ పురుష సమానత్వం అనే అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. అమితాబ్ చెప్పింది కూడా నిజమే. ముందు కుటుంబంలో స్త్రీ పురుష సమానత్వం అనే మార్పు వస్తేనే... సమాజంలో ఈ విషయంలో మంచి ఫలితాలు సాధించవచ్చు.

ఉమెన్స్ డే
మార్చి 8న ఉమెన్స్ డే నేపథ్యంలో వారికి మద్దతుగా అమితాబ్ ఈ ట్వీట్ చేసారు. అమితాబ్ ట్వీట్ మీద మహిళా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమితాబ్ లాంటి వారు స్పందించడం మంచి ప్రభావాన్ని చూపుతుందని వారంటున్నారు.

పాతికేళ్ల కింద బచ్చన్ కూడా చిరు కంటే బచ్చానే! (ఫోటో సాక్ష్యం ఇదే)
పాతికేళ్ల కింద బచ్చన్ కూడా చిరు కంటే బచ్చానే. అందుకు అప్పట్లో ఓ మేగజైన్ ప్రచురించిన కథనమే ఇందుకు నిదర్శనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అమితాబ్ కూతురు శ్వేతా ర్యాంప్ వాక్ చేసి సందడి చేసింది.
అమితాబ్ బచ్చన్ గారాల కూతురు శ్వేతా ఆ మధ్య ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వార్ చేసి సందడి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications











