Don't Miss!
- Sports చెన్నై సూపర్ కింగ్స్లో భారీ మార్పులు..!!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మారుతి సినిమా నుంచి ఆ హీరో తప్పుకున్నాడా? రెమ్యునరేషన్ వల్లే..
సాధారణంగా హిట్ వచ్చిన దర్శకులు ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు. మిడియమ్ సినిమాలను తెరకెక్కించే దర్శకులైతే కమిట్మెంట్స్ కారణంగా వీలైనంత త్వరగా షూటింగ్స్ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే చాలా కాలం తరువాత దర్శకుడు మారుతి కూడా తన నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో లేట్ చేయాల్సి వస్తోంది. గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమాతో సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే.
అసలైతే ఈ ఏడాది మార్చ్ లోనే మరో సినిమాను స్టార్ట్ చేయాలని అనుకున్నాడు దర్శకుడు మారుతి. కానీ అనుకోకుండా కరోనా లాక్ డౌన్ వల్ల ప్లాన్ మొత్తం క్యాన్సిల్ అయ్యింది. హీరోల డేట్స్ కూడా మారిపోయాయి. దీంతో అందుబాటులో ఉంటారనుకున్న హీరోలు కూడా ఇప్పుడు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ఫైనల్ గా రవితేజతో ఇటీవల ఒక ప్రాజెక్టుకి ఒకే చెప్పినట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.
అయితే రెమ్యునరేషన్ విషయంలో మాస్ రాజా కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా గాసిప్స్ వచ్చాయి. క్రాక్ తో హిట్టు కొట్టి అప్పుడు తన రేంజ్ కి తగ్గట్లు పారితోషికం తీసుకుంటానని మాస్ రాజా గట్టిగానే చాలెంజ్ చేశాడని కూడా టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు మాస్ రాజా వేరే సినిమాలతో బిజీ అవుతుండడం వలన ఆ ప్రాజెక్టు చేయలేనని డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. మారుతి లాంటి దర్శకుడికి మాస్ రాజా నో చెప్పడంతో ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.