మహేష్ బాబు అభిమానులు ఇక రిలాక్స్ అవ్వచ్చు..!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించనున్న భారీ చారిత్రాత్మక చిత్రంలో మహేష్ బాబు ప్రధాన హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. పల్లవ రాజులు, చోళ రాజుల కథాంశంతో రూపొందే ఈ చిత్రంలో తమిళ తారలు విజయ్, ఆర్య కూడా నటిస్తున్నారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంచితే, ఈ చిత్రంలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేశారన్న వార్త మహేష్ బాబు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎందుకంటే, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ఖలేజ' సినిమా పట్ల పలు కామెంట్లు వచ్చాయి. అయితే, మణిరత్నం సినిమాలో మహేష్ బాబు సరసన అనుష్క నటించదనీ, విజయ్ కు జోడీగా ఆమె నటిస్తుందనీ తెలిసింది. సో...మహేష్ బాబు అభిమానులు రిలాక్స్ అవ్వచ్చు!


Click it and Unblock the Notifications











