Don't Miss!
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అనుష్క కొత్త చిత్రం 'సైజ్ జీరో' ప్రారంభం
హైదరాబాద్: వరసగా భారీ చిత్రాలు చేస్తున్న అనుష్క మరో చిత్రం కమిటైంది. 'సైజ్ జీరో' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఈ రోజే ప్రారంభం అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించబోయే భారి బడ్జెట్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది .
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.
అనుష్క ఓ బాలీవుడ్ సినిమాను అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 'అమన్ కి ఆశ' చిత్రాన్ని రూపొందించిన ఇ.నివాస్ తన తదుపరి చిత్రంలో అనుష్కను బాలీవుడ్కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
''నేను అనుష్కకు ఓ కథ వినిపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. ఏదైనా అనుష్క నుంచి ఓకే అనే మాట వచ్చాకే చెప్పగలను. ఈ కథకు అనుష్క వందశాతం సరిపోతుందని ఆమెను సంప్రదించాను. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి రావచ్చు''అని చెప్పారాయన.
సినిమా గురించి చెబుతూ ''ఈ చిత్రానికి 'జువీనల్' అనే పేరు ఖరారు చేశాం. మల్టీస్టారర్ చిత్రం. మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. భిన్న కథల సమ్మేళనంగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది''అని చెప్పారు నివాస్. అనుష్క ప్రస్తుతం 'బాహుబలి' చిత్రీకరణలో బిజీగా ఉంది.