బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఏం చేయాలో తెలియడంలేదు.. మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు కవల పిల్లలైన అరియానా, వివియానా అంటే చెప్పలేనంత ఇష్టం. అలా ప్రాణంగా చూసుకునే ఇద్దరి తుంటరి పిల్లలపై ఇటీవల ట్విట్టర్లో సరదాగా ఫిర్యాదు చేశాడు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు కవల పిల్లలైన అరియానా, వివియానా అంటే చెప్పలేనంత ఇష్టం. సమయం దొరికితే వారితో ఎక్కవ సమయం గడపడానికే ఉత్సాహం చూపిస్తాడు. అలా ప్రాణంగా చూసుకునే ఇద్దరి తుంటరి పిల్లలపై సరదాగా ఫిర్యాదు చేశాడు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటూ విష్ణు ట్వీట్ చేశాడు.

'అరి, వివి ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడంలో ఎలా మాస్టర్లయ్యారో నాకైతే అర్థం కావడం లేదు. వారి ఇష్టాలను అంగీకరించే విధంగా నాపై ఒత్తిడి చేస్తున్నారు. వారిని ఎలా తట్టుకోవాలో అర్థం కావడం లేదు' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.

ముద్దుముద్దుగా కనిపించే అరి, వివి ఇద్దరు ఇటీవల తమ ఐదో పుట్టిన రోజు జరుపుకొన్న సంగతి తెలిసిందే. ఇద్దరు పిల్లలంటే మంచు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టం.



Click it and Unblock the Notifications











