Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా, దర్శకుడిపై అరెస్టు వారెంట్
హైదరాబాద్: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'రామ్ లీలా' చిత్రం విడుదల సమయంలోనే వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఓ వర్గం సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా ఉన్నాయని అప్పట్లో కొందరు కోర్టుకెక్కారు. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఈ కేసుకు సంబంధించిన... తాజాగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రాలపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అడ్వకేట్ సుధీర్ కుమార్ ఓఝా నవంబర్ చివరి వారంలో ఈ సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన కేసుకు సంబంధించి ఈ అరెస్టు వారెంట్ జారీ అయింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు సినిమాపై అప్పట్లో నవంబర్ 22 వరకు నిషేదం విధించినప్పటికీ నవంబర్ 12న సినిమాను విడుదల చేసారు. దీంతో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ సినిమా దర్శక నిర్మాతలు, యాక్టర్లకు సమన్లు జారీ చేసారు. ఫిబ్రవరి 14న కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆ సమన్లను వారు పట్టించుకోక పోవడంతో ఇపుడు అరెస్టు వారెంటు జారీ చేసారు.
ఈ మేరకు సినిమా దర్శక నిర్మాతలు, నటీనటులను అరెస్టు చేసి జూన్ 4వ తేదీలోగా తమ ముందు హాజరు పరుచాల్సిందిగా చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్.పి.సింగ్ ముంబై పోలీస్ కమీషనర్ను ఈ రోజు ఆదేశించారు.