Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆ ఎఫెక్ట్ లేదు-‘బాద్ షా’ విడుదలపై బండ్ల గణేష్ ట్వీట్
హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ ఇంటిపై ఇటీవల ఐటి దాడులు జరుగడం, రెండు రోజుల పాటు ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసులో సోదాలు నిర్వహించడం, ఆ తర్వాత అతన్ని ఇన్కం టాక్స్ ఆఫీసుకు పిలిపించి ప్రశ్నించడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాల ప్రభావం ఆయన ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హీరోగా నిర్మిస్తున్న 'బాద్ షా' చిత్రంపై పడుతుందని అంతా భావించారు. అయితే ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేసారు.
'బాద్ షా ఆడియో మార్చి 10న విడుదల చేయబోతున్నాం. అదే విధంగా ఏప్రిల్ 5న సినిమాను విడుదల చేస్తాం. ఈ చిత్రం గొప్పవిజయం సాధిస్తుంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అంటూ బండ్ల గణేష్ తన ట్విట్టర్లో ట్వీట్ చేసారు. 'బాద్ షా' చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్ ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్ లలో జరిగింది. కొన్ని సీన్లను మాత్రం హైదరాబాద్ లో చిత్రీకరించారు. క్లైమాక్స్ కు సంబంధించిన కొన్సి యాక్షన్ సీక్వెన్స్ ఇటీవల నాగార్జున సాగర్ వద్ద చిత్రీకరించారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.