Don't Miss!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
చిరంజీవిపై పేలిన బాలయ్య డైలాగ్...!
ఆసక్తికరంగా మారిన మరో డైలాగ్ ఏమిటంటే...'అభిమానుల్ని రెచ్చగొట్టొద్దు' అని బాలయ్య అనడం. దీన్ని బట్టి ఇటీవల రచ్చ సినిమాలో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ బాలయ్యకు కౌంటర్గా ఉందనే వార్తలు వచ్చాయి. దానికి కౌంటర్ గా బాలయ్య ఈ డైలాగ్ విసిరి ఉంటాడని సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఇక ఈచిత్రంలో జగన్ను టార్గెట్ చేస్తూ భారీ డైలాగులు పేలిన విషయం తెలిసిందే. 'మంచి నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి కానీ...రోడ్డు మీద బొమ్మల్లో కాదు, విగ్రహాల రాజకీయం చేస్తావా' అంటూ పవర్ ఫుల్ సెటర్లు విసిరారు నట సింహం. నిన్న బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సినిమా ఉంటుందని, పొలిటికల్ సెటైర్లు ఉన్న మాట వాస్తవమే అన్నారు.
జరుగబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారానికి వెళతారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ 'అధినాయకుడు' సినిమానే ప్రచారానికి వెలుతుంది అని సమాధానం ఇచ్చారు. దీన్ని బట్టి ఈచిత్రం పొలిటికల్గా తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా, కాంగ్రెస్, వైఎస్ఆర్సి పార్టీలను టార్గెట్ చేసినట్లు ఉందని స్పష్టం అవుతోంది.
ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించిన ఈచిత్రానికి పరుచూరి మురళి దర్శకత్వం వహించారు. లక్ష్మిరాయ్, సలోని హీరోయిన్లు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. జూన్ 1న ఈచిత్రం గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.