Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అఫీషియల్: బాలయ్య 100 వ చిత్రానికి... అమరావతికి లింక్
హైదరాబాద్ : గత కొద్ది రోజులుగ బాలకృష్ణ వందో చిత్రం గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రైతులు కష్టాలు నేపధ్యంలో చిత్రం చేస్తారని, మరో ప్రక్క అదేంలేదు సింగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో ఆదిత్యా 999 చేస్తారని, పటాస్ దర్శకుడు విని ఓకే చేసారని ఇలా వినిపించాయి. మీడియా వీటిని హైలెట్ చేస్తూ వచ్చింది.
అయితే వీటిన్నటికి చెక్ పెడుతూ బాలయ్య వందో చిత్రం గురించి క్లూ ఈ రోజు ఇచ్చారు. ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ..తన వందో చిత్రం అమరావతిని ఏలిన గౌతమీ పుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఉంటుందని, అది ఒక హిస్టారికల్ చిత్రం అని అన్నారు. త్వరలో అఫీషియల్ ఎనౌన్సమెంట్ అమావస్య వెళ్లాక వస్తుందని చెప్పుకొచ్చారు.
అలాగే దర్శకుడుగా క్రిష్ ఉండే అవకాసం ఉందని, ఆ విషయమై చర్చలు జరుగుతున్నాయని హింట్ ఇచ్చారు. అంతేకాదు కృష్ణవంశీ రైతు రాజ్యం, సింగీతం గారి ఆదిత్యా 999 ఏ క్షణం అయినా పట్టాలు ఎక్కే అవకాసం ఉందని తేల్చి చెప్పారు.
అలాగే.. తన కుమారుడు మోక్షజ్ఞ తెరంగ్రేటంపై నందమూరి బాలకృష్ణ స్పష్టతనిచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్ చిత్రంలో తాను, మోక్షజ్ఞ కలిసి నటిస్తామని చెప్పారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందన్నారు.