Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ధియోటర్ లో పైరసీ చేస్తుంటే పట్టుకున్న ‘లయన్’ టీమ్
హైదరాబాద్ : పైరసీ సినిమాకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పెద్ద సినిమాలు ఈ పైరసీ తో చాలా నష్టపోతున్నారు. దాంతో వేరే వారిపై ఆధారపడకుండా తమ చిత్రాలు పైరసీ బారిన పడకుండా తామే రంగంలోకి దిగి రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మొన్న గురువారం బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మించిన ‘లయన్' చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని పైరసీ చేయడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
బెంగుళూరులోని ఓ థియేటర్లో ఈ సినిమాని కెమెరాతో చిత్రీకరించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించగా, సకాలంలో అక్కడికి చేరుకున్న ‘లయన్' టీమ్ ఆ ప్రయత్నాలకు అడ్డు పడ్డారు. అలాగే రైల్వే కోడూరులో రవి అనే వ్యక్తి తన ఇంట్లోనే ‘లయన్' పైరసీ సీడీ తయారు చేస్తున్నాడనే సమాచారంతో ‘లయన్' టీమ్ అక్కడికి వెళ్లగా, అతను తప్పించుకుని పారిపోయాడు. ‘లయన్' సినిమాను పైరసీ చేసే ప్రయత్నాలు సాగనివ్వమనీ, ఇప్పటికే కొంతమంది వ్యక్తులపై నిఘా పెట్టామని ‘లయన్' టీమ్ చెప్పింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
తాజాగా ఒంగోలులోని సీడీ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లయన్ సినిమా పైరసీ సీడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీడీ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. లయన్ పైరసీ వెనక....సౌతిండియా పైరసీ మాఫియా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఈ పైరసీ సీడీలు ఇప్పటికే పంపిణీ అయినట్లు సమాచారం. అదే నిజమైతే పైరసీ కారణంగా నిర్మాతలు నష్టపోవడం ఖాయం.
సినిమా విషయానికొస్తే....‘లయన్' చిత్రం ఓపెనింగ్స్ భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 5.5 కోట్ల మేర వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రుద్రపాటి రామరావు నిర్మాత. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు