నిలదీస్తా నిత్యం జనహితం.. ‘భరత్ అనే నేను’ హామీ ఇస్తున్నా.. ఫస్ట్ సాంగ్ అదుర్స్
శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేశ్బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన 'భరత్ అనే నేను' చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ను యూనిట్ విభిన్నమైన విధానంలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ ఓథ్, టీజర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 25న (ఆదివారం) విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ మహేశ్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
విరచిస్తా నేడే నవశకం.. నిలదీస్తా నిత్యం జనహితం.. నలుపెరుగని సేవే అభిమతం.. కష్టం ఏదైనా సమ్మతమే అంటూ సాగే పాట ఆలోచింపజేసే విధంగా ఉంది. ఆ పాట మీకోసం..


Click it and Unblock the Notifications











