వేటాడిన కేసు, కోర్టుకు హాజరైన సైఫ్, సోనాలి, టబు

By Bojja Kumar

జోధ్‌పూర్: పదిహేనేళ్ల నాటి కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, హీరోయిన్లు సోనాలీ బింద్రే, టబు శుక్రవారం జోధ్‌పూర్ కోర్టుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఒక రోజు ముందే వారు విమానంలో జోధ్ పూర్ చేసుకున్నారు. ఆ సమయంలో వారు మీడియా కంటపడ్డారు.

కేసు వివరాల్లోకి వెళితే.... గతంలో కోర్టు వీరిపై పలు అభియోగాలు నమోదు చేసింది. జోధ్‌పూర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వారి కేసును విచారిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని 9/51, 9/52 సెక్షన్లతో పాటు భారతీయ శిక్షా స్మృతిలోని 149 సెక్షన్ కింద వారిపై అభియోగాలు మోపారు.

కృష్ణజింకల వేటలో పాల్గొన్న నటీనటులపై అభియోగాలను 2012 డిసెంబర్‌లో హైకోర్టు సవరించింది. 1998 అక్టోబర్ 1 అర్ధరాత్రి దాటాక జోధ్‌పూర్ సమీపంలో రెండు కృష్ణజింకలను వేటాడి చంపడంతో బాలీవుడ్ నటీ నటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల క్రిందట జరిగిన సంఘటనకు సంబంధించిన కేసు ఇప్పటికీ ఓ కొలక్కి రావడం లేదు. ఏళ్ల తరబడి విచారణ సాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X