Don't Miss!
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- News నా తల్లి మంగళసూత్రమిస్తే, అమ్మమ్మ బంగారమిచ్చింది-మోడీకి ప్రియాంక ఘాటు కౌంటర్..!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్రీదేవి చనిపోయాక బోని ఫస్ట్ కాల్ అతడికే..సైలెంట్ మోడ్లో ఫోన్!
శ్రీదేవి మృతి విషయంలో దుబాయ్ అధికారులు విచారం కొనాగిస్తున్నారు. అధికారులు కేసుని ఓ కొలిక్కి తీసుకునివస్తే కానీ శ్రీదేవి మృతి విషయంలో మిస్టరీ వీడేలా కనిపించడంలేదు. అంతకన్నా ముందు శ్రీదేవి పార్థివ దేహాన్ని ఇండియాకు పంపాలని అధికారులు కోరుకుంటున్నారు. అది జరగాలంటే దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు ఈ కేసులో ఎలాంటి మిస్టరీ లేదని నిర్ధారించాలి. దీనితో శ్రీదేవి భౌతిక ఖాయం ఇండియాకు రావడానికి సమయం పెట్టె అవకాశం కనిపిస్తోంది. కాగా అధికారులు బోనికపూర్ కాల్ డేటాని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బోణి ఎక్కువసార్లు ఎంపీ అమర్ సింగ్ కు ఫోన్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి.
Recommended Video
నేడు కూడా అనుమానమే
శ్రీదేవి పార్థివ దేహం మంగళవారం కూడా ఇండియాకు వచ్చే విషయంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయ్ లో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు శ్రీదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం లేదని కొందరు అభిప్రాయ పడుతున్నారు.
బోని కాల్ డేటా పరిశీలన
దుబాయ్ పోలీస్ లు ఈ కేసుని ఓ కొలిక్కి తీసుకుని వచ్చేందుకు బోని కపూర్ కాల్ డేటాని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి మృతికి ముందు ఏం జరిగిందనే వివరాలని పోలీస్ లు సేకరించే పనిలో ఉన్నారు.
కాల్ లిస్ట్ లో అతడి నంబర్ ఎక్కువగా
శ్రీదేవి మరణం తరువాత బోని కపూర్ ఎక్కువసార్లు ఎంపీ అమర్ సింగ్ తో ఫోన్ లో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. కాల్ లిస్ట్ లో ఎక్కవగ అమర్ సింగ్ నంబర్ ఉన్నట్లు పోలీస్ లు గుర్తించారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఫస్ట్ కాల్ అతడికే
దీనిపై జాతీయ మీడియా అమర్ సింగ్ ని ఆరాతీసే ప్రయత్నం చేసింది. అమర్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం బోనికపూర్ శ్రీదేవి మరణం తరువాత మొట్టమొదటి కాల్ అమర్ సింగ్ చేసినట్లు తెలుస్తోంది.
సైలెంట్ మోడ్ లో ఫోన్
అర్థరాత్రి 12 గంటల 40 నిమిషాలకు బోని తనకు ఫోన్ చేసారని అమర్ సింగ్ అన్నారు. ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉండడంతో తాను గుర్తించలేదని అన్నారు. ఆ తరువాత ల్యాండ్ లైన్ ననంబర్ కు చేసారు. గద్గ స్వరంతో శ్రీదేవి మరణ వార్తని వినిపించారు. బహుశా ఆ విషయం ఆయన నాకే మొదటి చెప్పి ఉండవచ్చు అని అమర్ అన్నారు.
బోని ఫ్యామిలీతో ఫ్రెండ్ షిప్
బోని కపూర్ కుటుంబానికి అమర్ సింగ్ బాగా సన్నిహితుడు. బోని కుటుంబంతో తనకు అవినాభావ సంబంధం ఉందని అమర్ సింగ్ తెలిపారు. శ్రీదేవి ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆల్కహాల్ సేవించి ఉందని రావడంతో ఆయన ఖండించారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదని, చాలా తక్కువ సందర్భాల్లో వైన్ తీసుకుంటారని అన్నారు.