Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరోయిన్ ని ఫోటోలు తీసారని, రక్తం వచ్చేలా కొట్టారు
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఫోటోలను తీస్తుండగా బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద గురువారం చోటు చేసుకుంది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఫోటోలను తీస్తుండగా బౌన్సర్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద గురువారం చోటు చేసుకుంది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కలిసి హోటల్ నుంచి బయటకు వస్తుండగా అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించినందు ఫొటోగ్రాఫర్లమీద విచక్షణారహితంగా దాడి జరిగింది. ఈ ఘటనపై బాధిత ఫోటోగ్రాఫర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబైలో అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. నటి శిల్పా శెట్టి, భర్త రాజ్కుంద్రాతో డిన్నర్ కోసం ముంబై, బంద్రాలోని బస్టైన్ హోటల్కు వచ్చారు. ఆమె తిరిగి వెళ్తున్న సమయంలో అక్కడున్న ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించారు. విధుల్లో హోటల్ బౌన్సర్లు.. ఫోటోగ్రాఫర్లపై విచక్షణారహితంగా దాడి చేశారు.
వారు అలా కారు ఎక్కగానే, ఇలా హోటల్ బౌన్సర్లు దాడికి దిగి, దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఈ ఘటనలో సోను, హిమాన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీయగా, ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హోటల్ బౌన్సర్ల దాడిపై జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను వార్తా సంస్థ 'ఏఎన్ఐ' షేర్ చేసింది.