Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వారిని కించ పరిచే సినిమాలు చేయొద్దు: బాలకృష్ణ
''మంత్రం బ్రాహ్మణాదీనం.. దైవం మంత్రాదీనం, ఆపరేషన్ వైద్యుడే చెయ్యాలి.. ఆలయ పూజ అర్చకుడే చెయ్యాలి.. భక్తి బ్రాహ్మణుల వృత్తి.. అది భగవంతుడు వాళ్లకిచ్చిన శక్తి' అంటూ బ్రాహ్మణుల గురించి 'జై సింహ' చిత్రంలో గొప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంఘాలు బాలకృష్ణతో పాటు చిత్ర బృందాన్ని సన్మానించారు.
జ్ఞాన సంపదలో బ్రాహ్మణున్ని...వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.... ‘నేను జ్ఞాన సంపదలో బ్రాహ్మణున్ని, ఐశ్వర్యంలో వైశ్యున్ని, మంచికి మాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కుమ్మరిని, కంసాలిని, రజకున్ని, నాయీ బ్రాహ్మణున్ని, కల్లు గీత కార్మికున్ని, కల్మషం లేని యాదవున్ని, ఆపదలో ఆదుకునే వెలమను, వ్యక్తిత్వంలో రాజును, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని.... అన్ని కులాలు ఆదరించే సినిమా ‘జై సింహ' అని బాలయ్య తెలిపారు.
Recommended Video
రామానుజాచార్యగా నటిస్తా
‘‘ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ బ్రాహ్మణుడుగా పుట్టే అవకాశం రాదు. వాళ్ల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ‘జై సింహ' సినిమాలో సన్నివేశాలుండటం సంతోషంగా ఉంది. రామానుజాచార్యులు అంతా సమానమే అని చెబుతూ, చాపకూటి సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. అష్టాక్షరి మంత్రాన్ని కూడా రాసి ప్రచారం చేశారు. నా అరవైయవ ఏట ఆయన పాత్రలో సినిమా చేస్తాను'' అని బాలయ్య తెలిపారు.
బ్రాహ్మణులను కించపరిచే సినిమాలు చేయొద్దు
ఇక నుండి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలను తీయకూడదు. అందరికీ ఉపయోగపడే విధంగా వుండాలి. ఎవరినీ అవమానించకూడదు అని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా బాలకృష్ణ తెలిపారు.
నాన్నగారి జీవిత సారాంశం
తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. నాన్నగారి జీవిత సారాంశాన్ని తీసుకుని 'యన్.టి.ఆర్.' సినిమాని తీస్తున్నాం. మహానుభావుడైన ఆయనకి కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మసుకృతమని ఈ సందర్బంగా బాలయ్య తెలిపారు.
మన తెలుగు వాళ్లకి ఘన చరిత్ర ఉంది
మన తెలుగు వాళ్లకి ఘన చరిత్ర ఉంది. వందేళ్ల కిందటే గండి విశ్వనాథశాస్త్రిని జర్మనీవాళ్లు కిడ్నాప్ చేసి వేదసారాంశాన్ని తెలుసుకొని సాంకేతికంగా ఎదిగారు. ఇప్పటికి కూడా ఆయన ఫొటో అక్కడ రాయబార కార్యాలయంలో ఉంది. అలాంటి చరిత్ర మనది. అదంతా వెలుగులోకి రావడంలో సినిమా కీలక పాత్ర పోషిస్తోంది. తొలి తెలుగు రాజ్యం శాతవాహనులది. ఆ చరిత్ర ఆధారంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి' తీశామని బాలయ్య తెలిపారు.