Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
మనోభావాలు దెబ్బతీసారు: 'గుంటూరు టాకీస్' సినిమాపై కేసు
హైదరాబాద్ :నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రవీణ్ సత్తార్ రూపొందించిన గుంటూరు టాకీస్ చిత్రం వారం క్రితం విడుదలై ఓ వర్గాన్ని బాగా ఆకట్టుకుంటూ భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వికలాంగుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా తీశారంటూ కేసు నమోదైంది.
గుంటూరు టాకీస్ ఫోటో గ్యాలెరీ
గుంటూరు టాకీస్ సినిమా దర్శక, నిర్మాతలపై తెలంగాణ వికలాంగుల హక్కుల సమితి నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం సమితి నాయకులు దుండి సైదులు, బానాల వెంకటయ్య మాట్లాడుతూ సినిమాలో పలుమార్లు వికలాంగుల మనోభావాలు దెబ్బతినేవిధంగా వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు.
సినిమా దర్శక, నిర్మాతలపై పీడబ్ల్యూడీ యాక్ట్ 1995 ప్రకారం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వికలాంగుల హక్కుల సమితి నాయకులు మహేశ్, లక్ష్మణ్, అమృత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.