ఆస్కార్ నామినేషన్ రేసులో మద్దాలి ‘చదువుకోవాలి’

తాజాగా ఈచిత్రం ఆస్కార్ నామినేషన్ పోటీల్లో నిలబడింది. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోని వివిధ భాషలకు చెందిన చిత్రాలను పరిశీలించి దేశం తరుపున ఒక సినిమాను ఆస్కార్ నామినేషన్కు నామినేట్ చేస్తారు. ఆ లిస్టులో ముద్దాలి సినిమా 'చదువుకోవాలి' కూడా ఉంది. సెప్టెంబర్ 17 నుంచి ఆస్కార్ నామినేషన్ చిత్రాల పరిశీలన జరుగనుంది.
ఇప్పటికే 'చదువుకోవాలి' చిత్రం భరతముని అకాడమీ నుంచి 9 అవార్డులు చేసొంతం చేసుకుంది. అదే విధంగా టీవీ9-టీఎస్ఆర్ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికయింది. ఈచిత్ర దర్శకుడు మద్దాలి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంచే ఉగాది పురస్కరాన్ని కూడా అందున్నారు.
ఈ సినిమా వల్ల తాను ఆర్థికంగా ఇబ్బందులపాలైనా...సమాజానికి ఉపయోగపడే మంచి చిత్రాన్ని అందించామన్న తృప్తి మిగిలిందని, దేశంలో వందశాతం అక్షరస్యత కోసం ఈ సినిమా తోడ్పడుతుందని ముద్దాలి తెలిపారు. చెన్నై, కేరళ, ముంబై, జైపూర్, కలకత్తా, గోవా, కెనడా, పాట్నా, హైదరాబాద్ తదితర ప్రపంచ సినిమా ఉత్సవాలకు తమ సినిమా పంపిస్తున్నామని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











