Just In
- 17 min ago
కరోనా ఎఫెక్ట్.. క్వారంటైన్లో పవన్ కళ్యాణ్.. ఆందోళనలో అందరూ అలా!
- 31 min ago
మరో పవర్ఫుల్ మాస్ దర్శకుడిని లైన్ లో పెడుతున్న రవితేజ?
- 1 hr ago
అందరి ముందే ఊహించని పని చేసిన పవన్ ఫ్యాన్: ఆ సంఘటనపై అనసూయ ఆగ్రహం.. చూస్తూ ఊరుకుంటారా అంటూ!
- 1 hr ago
నేను లగడపాటి రాజ్ గోపాల్ కలిసి కొట్టాం.. ఆ గొడవ తరువాత ఏం జరిగిందంటే: RGV
Don't Miss!
- Sports
ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్కు గట్టి షాక్.. కెప్టెన్ ధోనీకి భారీ జరిమానా!
- Finance
డాలర్ మారకంతో 75 స్థాయికి రూపాయి, వరుసగా 5 సెషన్లలో పతనం
- News
ఇది మోదీ-షాల మారణహోమం -కూచ్బెహార్ కాల్పులపై బెంగాల్ సీఎం మమతా ఫైర్ -ఈసీపైనా విమర్శలు
- Lifestyle
Ugadi 2021: ఉగాది శుభాకాంక్షలు ఇలా చెబితే.. మీ సన్నిహితులు చాలా సంతోషిస్తారు...
- Automobiles
మలేసియాలో విడుదలైన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్; పూర్తి వివరాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
74th Independence Day : త్యాగాలను స్మరించుకుందాం.. చిరు, పవన్, బన్నీ, చెర్రీ ట్వీట్స్ వైరల్
భారతదేశ 74వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే కోవిడ్ నిబంధనలు, కరోనా వ్యాప్తి కారణంగా గతంలో మాధిరిగా ఎక్కడా కూడా సమూహ వేడుకలను జరుపడం లేదు. ఈ క్రమంలో తమ తమ ఇంట్లో, కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తిని చాటుతున్నారు.ఈ క్రమంలో మన తారలు కూడా జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చిరు శుభాకాంక్షలు..
నేటి స్వాత్రంత్ర్య దినోవ్సతవాన్ని పురస్కరించుకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ 74వ స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పునాదులు వేసిన మహానుభావుల త్యాగాలను, వారి ఆదర్శాలను మనమంతా గుర్తు చేసుకుందాం'అని ట్వీట్ చేశారు.

జెండా ఎగురవేసిన పవన్..
పవన్ కళ్యాణ్ తన జనసేన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.

ఆర్ఆర్ఆర్ హీరోలు..
రామ్ చరణ్, ఎన్టీఆర్లు ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘ప్రతీ ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న యోధులకు, కరోనా మహమ్మారిని అరికట్టడానికి పోరాడుతున్న వారియర్స్కు వందనం. మనమంతా కలిసికట్టుగా ఈ అడ్డంకులను త్వరలోని అధిగమిస్తాం'అని ట్వీట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ స్పందిస్తూ.. 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ అని చెప్పుకొచ్చాడు.

బన్నీ ట్వీట్..
అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. నా భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుందాం జై హింద్ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇలా ప్రతీ ఒక్కరూ ప్రజలందరికీ స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.