Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి పుసుక్కున అలా అన్నారేంటబ్బా.. నూలుపోగుతో సమానమట..
కళాతపస్వికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన నేపథ్యంలో.. కే విశ్వనాథ్ను, బాలును ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ సన్మానించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
అవార్డులు, రివార్డులు ఎవరికైనా, ఏ రంగాల్లోని వారికైనా ప్రోత్సాహాన్నిస్తాయి. సినీ పరిశ్రమలో అయితే ఇంకా వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అప్పడప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకునే వారైతే వాటిని ప్రాణంగా చూసుకొంటారు. అయితే సినీ దిగ్గజాలకు అవార్డులు, రివార్డుల వచ్చినా పెద్దగా స్పందించకనిపించదు. ఎందుకంటే వారు జీవితంలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించి వస్తారు కాబట్టి. ఇదంతా ఎందుకంటే.. కళాతపస్వికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన నేపథ్యంలో.. కే విశ్వనాథ్ను, బాలును ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ సన్మానించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే..
సన్మానించుకోవడంలో తప్పులేదు
తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన వారిని సన్మానించుకోవడంలో తప్పులేదు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే శంకరాభరణంకు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగు పరిశ్రమకు మైలురాయిలాంటి ఆ సినిమా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విశ్వనాథ్తో సినిమాలు చేశాను. నాకు క్లాసు, మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది ఆయన సినిమాలే అని పేర్కొన్నారు.
వారిని అలా గౌరవించడం ఆనందంగా..
విశ్వనాథ్, బాలసుబ్రమణ్యం కాంబినేషన్లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. సినిమా పరిశ్రమకు గౌరవం తచ్చిన వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి సన్మానాలు వారికి కొత్తేమీ కాదు. ఇవన్నీ వాళ్లకి నూలుపోగుతో సమానం అని చిరంజీవి అన్నారు.
నేను మీ విశ్వనాథ్నే..
అనంతరం కె.విశ్వనాథ్ మాట్లాడుతూ 'అవార్డు వచ్చిందని నేనీ సన్మానానికి రాలేదు. సాధారణమైన వ్యక్తిగా వచ్చా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాకు ఇప్పుడు వచ్చింది. రేపు ఇంకొకరికి వస్తుంది. ఎప్పటికీ నేను కాశీనాథుని విశ్వనాథ్నే' అని చాలా హుందాగా చెప్పడం గమనార్హం.
సినిమాతో 51 ఏళ్ల అనుబంధం
ఆ తర్వాత గానగంధర్వుడు బాలు మాట్లాడుతూ... తెలుగు సినిమాతో నాకు 51 ఏళ్ల అనుబంధం ఉంది. ఇంతకాలం నన్ను భరించి ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. అన్నయ్య విశ్వనాథ్గారి పక్కన కూర్కొని సన్మానం అందుకోవడం గర్వంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు.