Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కార్పోరేట్ హాస్పిటల్లో శవానికి వైద్యం.. చిరంజీవి ఠాగూర్ సినిమాను తలపించిన సీన్!
నిజజీవితంలోని సంఘటనల ఆధారంగానే సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయితే సినిమాల్లో చూపించినట్లు నమ్మడానికి కాస్త సందేహంగానే ఉన్నప్పటికీ మళ్ళీ ఎప్పుడైనా రియల్ లైఫ్ లో జరిగినప్పుడు మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఇక ఠాగూర్ సినిమాలో కొన్ని సన్నివేశాలు దాదాపు నిజ జీవితంలో నుంచి తీసుకున్నవే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా జనాలను కూడా ఎంతో ఆలోచింపజేసింది.
అయితే అందులోని ఒక ముఖ్యమైన సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన ఒక సన్నివేశం సినిమా మొత్తంలో కూడా చాలా హైలెట్ గా నిలుస్తుంది. ఒక విధంగా అది నిజంగా జరిగిందే. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు హాస్పిటల్ బిల్లులు పూర్తిస్థాయిలో చెల్లించకపోతే మరికొంత ట్రీట్మెంట్ చేస్తే బ్రతికే అవకాశం ఉంది అని చెప్పి బ్యాలెన్స్ డబ్బులు మొత్తం కూడా కట్టించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.
చిరంజీవి ఠాకూర్ సినిమాని గుర్తుకు తెచ్చిన యశోద హాస్పిటల్ సచ్చిపోయిన శవానికి చికిత్స ఇచ్చిన యశోద డాక్టర్లు !ఓల్డ్ మలక్పేట యశోద హాస్పిటల్ pic.twitter.com/DsESgm2fRH
— Sumanth (@sumanthmaddali) October 25, 2022
ఇక అలాంటి ఒక సంఘటన హైదరాబాద్ లోని నల్గొండ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఒక కార్పొరేట్ హాస్పిటల్ లో చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ కార్పోరేట్ హాస్పిటల్ లో చనిపోయిన శవానికి గంటల తరబడి ట్రీట్మెంట్ చేస్తున్నట్లు నాటకమాడి డబ్బులు తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే 14వ తేదీన అమ్మాయి చనిపోతే 15వ తేదీ కూడా ట్రీట్మెంట్ కొనసాగించినట్లు అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అప్పులు చేసి మరి డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో వైద్యానికి ఖర్చు చేస్తూ ఉంటే యాజమాన్యం మాత్రం ఈ విధంగా చేయడం చాలా అన్యాయం అని మరికొందరు ఆరోపిస్తున్నారు. 21 ఏళ్ల అమ్మాయి డెంగ్యూ ఫీవర్ తో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇక అమ్మాయి ట్రీట్మెంట్ కోసం అని చాలా డబ్బులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. చనిపోయిన తర్వాత కూడా మందులకు రక్తం మార్పిడి కోసం అవసరమవుతుంది అని మరింత డబ్బు అడిగినట్లుగా కూడా చెబుతున్నారు. మరి ఈ ఆరోపణలకు హాస్పిటల్ యాజమాన్యం ఏ విధంగా సమాధానం ఇస్తుందో చూడాలి.