ప్రకాశ్ రాజ్, మధుర శ్రీధర్ మధ్య ముదిరిన కోల్డ్ వార్.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, సినీ దర్శక, నిర్మాత మధుర శ్రీధర్రెడ్డికి మధ్య సోషల్ మీడియాలో కొత్త వివాదం తలెత్తింది. సోషల్ మీడియా అకౌంట్లో బ్లాక్ చేయడంతో మధుర శ్రీధర్ తీవ్రంగా స్పందించారు. ఇంతకీ వారి మధ్య వివాదానికి దారి తీసిన కారణాలు తెలియరాలేదు. కానీ వారి మధ్య కోల్డ్వార్ జరుగుతున్నదని స్పష్టమవుతున్నది. అసలు వివాదానికి కారణం ఏమిటంటే..

మధుర శ్రీధర్ను ప్రకాశ్ రాజ్ బ్లాక్
సోషల్ మీడియాలోని ట్విట్టర్ అకౌంట్లో మధుర శ్రీధర్ రెడ్డి, ప్రకాశ్ రాజ్ ఒకరికొకరు ఫాలో అవుతున్నారు. అయితే అనూహ్యంగా మధుర శ్రీధర్ను ప్రకాశ్ రాజ్ బ్లాక్ చేశారు. మధుర శ్రీధర్ తన అకౌంట్లో దానికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేశారు.

ట్విట్టర్ నుంచి మధుర శ్రీధర్కు మెసేజ్
ప్రకాశ్ రాజ్ మిమ్మల్ని బ్లాక్ చేశారు. ప్రకాశ్ రాజ్ను ఫాలో అవుతున్న మిమ్మల్ని ఆయన బ్లాక్ చేశారు. అలాగే ఇక నుంచి ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసే ట్వీట్లను చూడటానికి వీలు ఉండదు అని మధుర శ్రీధర్కు ట్విట్టర్ నుంచి ఓ సందేశం వచ్చింది.
Recommended Video


నన్ను బ్లాక్ చేసిన మొదటి వ్యక్తి
ట్విట్టర్ పంపిన సందేశాన్ని తన అకౌంట్లో ట్యాగ్ చేస్తూ.. ఇది అతని అసహనానికి నిదర్శనం. ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేసిన మొదటి వ్యక్తి ఈయనే. బహుశా సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన వారిలో భూమి మీద మొట్ట మొదటి వ్యక్తి ఆయనే అనుకొంటా అని మధుర శ్రీధర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

ప్రకాశ్ రాజ్కు ధైర్యం లేదు
నాతో లాజికల్ ఆర్గుమెంట్ చేయడానికి ప్రకాశ్ రాజ్ ఎన్నడూ ధైర్యం చాలదదు. కావాలంటే నేను ఛాలెంజ్ చేస్తాను. డియర్ ప్రకాశ్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ రోజులు పోయాయి. నీవు బాధ్యత కలిగిన లీడర్వు. ఎదైనా జవాబు ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి అని ప్రకాశ్ రాజ్కు మధుర శ్రీధర్ ట్వీట్లో సూచించారు.


Click it and Unblock the Notifications











