Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
' రాంబాబు' కి ప్రభుత్వ కమిటీ చెప్పిన కట్స్ ఇవే...
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు' తెలంగాణా వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏడు సీన్లను కత్తిరించాలని సూచిస్తూ సమాచారశాఖ మంత్రి డీకే అరుణకు శనివారం నివేదికను అందజేసింది.
ఆ నివేదికను పరిశీలించి నిర్ణయం ప్రకటించనున్నట్లు మంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సినిమాపై వివాదం నేపథ్యంలో మంత్రి ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అల్లాణి శ్రీధర్, ఎన్.శంకర్, టి.భరద్వాజ, విజయేందర్రెడ్డి, వందేమాతం శ్రీనివాస్, దిల్రాజు, అల్లం నారాయణ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తూ అల్లం నారాయణ, దర్శకుడు శంకర్ మాత్రం కమిటీని బహిష్కరించారు. కమిటీ సభ్యులు సినిమా చూసి ఏడు సీన్లను తీసేయాలని నిర్ణయించారు.
ఆ కట్స్ ఏమిటంటే...
* తెలుగుతల్లిపై దృశ్యాలు
* ఢిల్లీ అతిథిగృహంలో లీడర్ ఉన్నది
* బ్యాక్గ్రౌండ్లో నిజాం నవాబు ఫొటో కనిపిస్తున్న దృశ్యం
* తెలంగాణ కావాలా వద్దా అనే మాటలున్నది
* ఆత్మహత్యలపై ఉన్న మాటలు
* హాస్టళ్ల విద్యార్థులను ఉద్యమంలోకి తెస్తున్నారనే దృశ్యం
* సెటిలర్లు ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారనే మాటలు
చిత్ర ప్రదర్శన అనంతరం తమ్మా రెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని చెప్పారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు విజయేందర్డ్డి మాట్లాడుతూ సినిమాలో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచే విధంగా పలు సన్నివేశాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.
మరో సభ్యుడు అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ దర్శకుడు, నిర్మాతకు ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉంటుందని, దాన్ని వారు గుర్తెరగాలని సూచించారు. మిగిలిన సభ్యుల అభివూపాయాలు తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని సమాచార శాఖ కమిషనర్ చంద్రవదన్ చెప్పారు. ఇదిలా ఉండగా. చెత్త సినిమాలను తాము ఒప్పుకోబోమని, అందుకే ప్రభుత్వం ఈ సినిమా పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీని దర్శకుడు ఎన్ శంకర్తో కలిసి తాను బహిష్కరించానని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ చెప్పారు.