Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
'ఆగడు' కాపీ వివాదం :సంగీత దర్శకుడు వివరణ
హైదరాబాద్ : తాజాగా మహేశ్ హీరోగా నటిస్తున్న 'ఆగడు' రెండో టీజర్ కాపీ కాంట్రవర్శిలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్...మళయాళ చిత్రం 'అవతారం 'టీజర్ నుంచి లిప్ట్ చేసారని అంతటా వినిపించింది. దీనిపై టీవి ఛానెల్స్ పోగ్రామ్ లు సైతం చేసేసాయి. ఈ నేపధ్యంలో అవతారం చిత్రం కంపోజర్ వివరణ ఇచ్చారు. అది తమ పొరపాటే అని చెప్పుకొచ్చి తమన్ కి రిలీఫ్ ఇచ్చాడు.
అవతారం కు సంగీతం అందించిన మళయాళి మ్యూజిక్ డైరక్టర్ దీపక్ దేవ్ మాట్లాడుతూ... తమ ఎడిటర్ పొరపాటున ఆగడు సౌండ్ ట్రాక్ ని డమ్మీ ట్రైలర్ కి వాడాడన్నారు. అయితే ఆ ట్రాక్ మహేష్ బాబు ఆగడు చిత్రం ది అనే విషయం తెలియదని అన్నారు. ఆన్ లైన్ నుంచి ఓ డమ్మీ ట్రాక్ తీసుకుందామనే ప్రయత్నంలో జరిగిన పొరపాటు అన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తాను ఇంకా అవతారం చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని అన్నారు. తన ఎడిటర్ అత్యుత్సాహంతో ఆన్ లైన్ లో దొరికిన ట్రైలర్ ..ఎక్కడిదో తెలియకుండా వాడేసాడని, తను చూసుకోలేదని అని వివరణ ఇచ్చారు.
తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. కృష్ణ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా మొదటి టీజర్ తరహాలోనే ఈ రెండో టీజర్లో హైవోల్టేజి యాక్షన్ సీన్లు, పంచ్ డైలాగులు ఉన్నాయి.
మహేశ్ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడకొట్టిందంట', 'అయినా నువ్వు డైలాగ్ వేస్తే కౌంటర్ వెయ్యడానికి నేను రైటర్ని కాదు ఫైటర్ని, అయ్యబాబోయ్ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త టీజర్తో 'ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్ శ్రీను వైట్ల ఒక 'ఫీలర్' వదిలారని వారంటున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా మహేశ్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్ అందించిన మాస్ మసాలా గీతమిది. ఇందులో మహేష్, శ్రుతిహాసన్ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.