Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
చిన్న చిన్న వేషాలే... రామానాయుడిని స్టార్ ప్రోడ్యూసర్ని చేశాయి
హైదరాబాద్: ప్రముఖ చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ ఈరోజు 3.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. రామానాయుడిని చిరస్మరణీయంగా గుర్తుపెట్టుకోవడానికి ఆయనకు చాలా ప్రత్యేకతలున్నాయి.
రామానాయుడు తన పెద్ద కుమారుడు సురేష్ పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు. సురేష్ ప్రొడక్షన్స్ లోగో 'ఎస్పీ'కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ భాషల్లో 135కు పైగా చిత్రాలు నిర్మించారు. చాలా మంది ప్రముఖులు ఈ బ్యానర్లో నటించారు. రామానాయుడు తాను నిర్మించిన చాలా చిత్రాల్లో నటించారు. చిన్న చిన్న పాత్రల్లో ఆయన కాసేపు సినిమాల్లో కనిపించేవారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్, కలెక్టర్, జడ్జి వంటి పాత్రలను పోషించారు.
సినిమా రంగంలో స్టూడియోలను నెలకొల్పిన అతికొద్దిమంది ప్రముఖుల్లో దగ్గుబాటి రామానాయుడు ఒకరు. విశాఖపట్నంలో స్టూడియో ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి రామానాయుడు కావడం విశేషం. 1991లో రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ను నెలకొల్పారు.
గ్రామీణ యువతలో నైపుణ్యం పెంచేందుకు ఈ సంస్థ కృషిచేస్తోంది. ఇందుకోసం గాను మెదక్ జిల్లా తునికి గ్రామంలో 33 ఎకరాలను విరాళంగా ఇచ్చారు. రామానాయుడు తీసిన బెంగాలీ చిత్రం 'అసుఖ్' జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డు గెలుచుకుంది. దక్షిణాది చిత్ర ప్రముఖునిగా ఆయనకు ఫిల్మ్ఫేర్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డు లభించింది.
ప్రముఖ నటుడు వెంకటేష్, నిర్మాత రామానాయుడు కుమారుడు. ప్రఖ్యాత నిర్మాత సురేష్ ఆయన పెద్ద కుమారుడు. యువ నటులు రానా, నాగ చైతన్యలు... రామానాయుడికి మనవళ్లు. ఆయన కన్నుమూశారన్న వార్త తెలిసి షాక్కుగురైన పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు రామానాయుడు నివాసానికి చేరుకుంటున్నారు.