Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దండుపాళ్యం డైరెక్టర్ మరో సంచలనం: ‘ఆచార్య అరెస్ట్... ప్రతి హిందువుకు అవమానం’
దండుపాళ్యం దర్శకుడు కంచిపీఠంలో జరిగిన హత్య నేపథ్యంతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
నిజ జీవిత సంఘటనల ఆధారంగా 'దండుపాళ్యం' లాంటి సెన్సేషనల్, కాంట్రవర్సల్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాసరాజు మరో సంచలన సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సారి ఆయన అత్యంత వివాదాస్పద సబ్జెక్ట్... కంచి పీఠమ్ స్వామీజీ శంకరాచార్య జయేంద్ర సరస్వతి అరెస్టు ఉదంతాన్ని సినిమాగా తీయబోతున్నారు.
'ఆచార్య అరెస్ట్' అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఇన్సల్ట్ టు ఎవ్రీ హిందూ'(ప్రతి హిందువుకు అవమానం) అనేది ట్యాగ్ లైన్. దాదాపు రెండు సంవత్సరాల పాటు స్వామిజీతో సన్నిహితంగా ఉండే పలువురు వ్యక్తులను, ఈ కేసుకు సంబంధించిన వారిని కలిసి ఈ స్క్రిప్టు రెడీ చేశారు. ఎస్సార్టీ ఎంటర్టెన్మెంట్ బేనర్లో రామ్ తుల్లూరి ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు.
2004లో జరిగిన హత్యోదంతం ఆధారంగా
తమిళనాడులోని కంచి పీఠంలో 2004లో భక్తుడి హత్య జరిగింది. ఈ కేసుకు సంబంధించి జయేంద్ర సరస్వతిని అరెస్టు చేశారు. అసలు అప్పుడు ఏం జరిగింది? ఈ కేసు వెనక ఉన్న అసలు వాస్తవాలేమిటి? అనేది సినిమా ద్వారా చూపించనున్నారు.
ఎన్నో ఆసక్తికర విషయాలు
ఈ కేసు వెనక ఎన్నో కుతంత్రాలు, రాజకీయ కోణాలు, మతపరమైన కుట్రలు ఉన్నాయని రూమర్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి తెలియని కోణాలను సినిమాలో ఫోకస్ చేయబోతున్నారని సమాచారం.
జయేంద్ర సరస్వతి వెర్షన్ కూడా
ఈ సినిమాలో జయేంద్ర సరస్వతి వెర్షన్ కూడా చూపించబోతున్నారు. ఆయన ఈ కేసులోకి ఎలా వచ్చారు, అరెస్టుకు దారి తీసిన అంశాలు ఏమిటి? చూపించబోతున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మళయాలం, హిందీ ఇలా ఐదు బాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతోంది. నటీనటుల ఎంపిక ఇంకా జరుగలేదు, త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
దండుపాళ్యం 2
'దండుపాళ్యం' పేరు వింటే చాలు అతి భయంకరమైన సంఘటనలు మన కళ్ల ముందు మెదులుతాయి. రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈచిత్రం తొలి భాగం విజయం సాధించింది. ఇపుడు ఈచిత్రాని సీక్వెల్ గా 'దండుపాళ్యం-2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దండుపాళ్య-2 కొత్త ట్రైలర్... చూస్తే షాకవుతారు!