Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దాసరి 'అసెంబ్లీలో దొంగలు పడ్డారు' ప్రారంభం
ఇక రాజకీయ ప్రత్యర్థులపై దర్శకరత్న దాసరి నారాయణ రావు ఈ సినిమా అస్త్రాన్ని ప్రయోగించనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షాలపై వ్యంగ్య చిత్రాలు తీసిన దాసరి ఈసారి మాత్రం సొంత పార్టీ నేతల పైనే తీయనున్నారని తెలుస్తోంది. ఆయన అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ను ఫిలిం చాంబర్లో నమోదు చేసినట్లుగా సమాచారం. త్వరలో తన పదవి ముగుస్తుండటం, తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం, చిరుకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండటం వంటి ఇలాంటి సమయంలో దాసరి అసెంబ్లీలో దొంగలు పడ్డారు అనే టైటిల్ నమోదు చేయించారనే వార్త చర్చకు దారి తీసింది.
గత సాధారణ ఎన్నికలకు ముందు ఆయన మేస్త్రీ అనే చిత్రాన్ని తీశారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవిని లక్ష్యంగా చేసుకొనే ఆయన ఈ సినిమా తీసినట్టు ప్రచారం జరిగింది. అంతకుముందు తీసిన పిచ్చోడి చేతిలో రాయి టిడిపిని లక్ష్యంగా పెట్టుకొని తీసిందేననే వాదనలు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై సినిమా ద్వారా వ్యంగ్యాస్త్రాలు ఎక్కు పెట్టడంలో దాసరికి ఎవరూ సాటి లేరనే చెప్పవచ్చు. గతంలో ఓసారి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓ సినిమా తీసేందుకు దాసరి సిద్ధమైన సమయంలో ప్రస్తుత కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఆయనను వద్దని చెప్పారట.
ఆయన తాజాగా తలపెట్టిన చిత్రం 2014 ఎన్నికలకు ముందు విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. ఇందులో ఆర్టిస్టులు ఎవరో ఇంకా ఖరారు కాలేదు. సొంతపార్టీలోని ప్రత్యర్థులను టార్గెట్ చేయడం ద్వారా దాసరి సంచలనానికి తెరదీయబోతున్నారని అంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్న సమయంలో దాసరి తన ఉదయం పత్రిక ద్వారా ఆయనను టార్గెట్ చేశారు. అయితే అప్పుడు కాంగ్రెసులో ఉండటంతో టిడిపి, ఆ తర్వాత మేస్త్రీ ద్వారా చిరంజీవిని టార్గెట్ చేశారు. మారిన ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకోవడం విశేషం.